తొలిసంధ్య వేళలో తేనీటితో రెండు బిస్కెట్లు.. బ్రేక్ఫాస్ట్లోకి మొలకెత్తిన గింజలు.. మధ్యాహ్నం భోజనంలోకి ఒకట్రెండు మిల్లెట్ లడ్డూలు.. మళ్లీ సాయంత్రం హాట్హాట్గా మరోరకం స్నాక్స్… ఇన్ని ఉంటే కానీ పూట గడవడం లేదంటున్నారు యంగిస్థాన్లు. ఇంటినుంచే ఉద్యోగ పర్వాన్ని సమర్థంగా నిర్వహిస్తున్న వారిలో చాలామంది చిరుతిండ్లకు వీరాభిమానులు అయిపోతున్నారు. కరోనా దెబ్బతో టైమ్పాస్ మంచింగ్లోనూ ఆరోగ్యానికి మంచి చేసేవి ఉండేలా చూసుకుంటున్నారని ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది.
ప్రతి పదిమందిలో ఆరుగురు రోజుకు కనీసం రెండుసార్లయినా స్నాక్స్ రుచి చూస్తున్నారు.
70 శాతం మంది తృణధాన్యాలతో చేసిన చిరుతిండ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
69 శాతం మంది తమకు ఇష్టమైన ఆహార పదార్థాలకు పోషక విలువలు జోడించి మరీ ఆరగిస్తున్నారు.
వేళ కాని వేళ వేసే చిరు ఆకలిపై తక్షణ విజయం కోసం చిరుతిండ్లపై ఆధారపడుతున్నవారు 50
శాతం మంది. పని ఒత్తిడిని జయించడానికి స్నాక్స్ను మార్గంగా ఎంచుకుంటున్నవారు 49 శాతం వరకూ ఉన్నారు.
45 శాతం మంది రకరకాల రుచులు ఆరగించాలనే అత్యాశతో స్నాక్స్ ఆస్వాదిస్తున్నారు.