చిన్నపిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. వారికి వచ్చే వ్యాధుల్లో ప్రధానమైంది అతిసార. దీన్నే వివిధ ప్రాంతాల్లో ‘విరేచనాలు’, ‘బేదులు’ అని వ్యవహరిస్తారు. పిల్లలు మొదటి ఐదు సంవత్సరాల వయసులో పది నుంచి పదిహేనుసార్లు విరేచన వ్యాధితో బాధపడతారు. మొదటి ఏడాదిలోనే కనీసం మూడు నుంచి ఐదుసార్లు ఆ రుగ్మతకు లోనవుతారు. ఈ ప్రకారంగా, సంవత్సరానికి దాదాపు 30 రోజులు అతిసార వ్యాధితోనే సతమతం అవుతారు. ఈ సమస్య వల్ల దేశంలో ఏటా దాదాపు మూడు లక్షలమంది పిల్లలు మరణిస్తున్నారు.
ఏది అతిసార?
సాధారణంగా రోజుకు కనీసం మూడు సార్లు నీళ్ల విరేచనం కావడాన్ని ‘అతిసార వ్యాధి’ అంటారు. సంఖ్యతోపాటు విరేచనంలో వచ్చిన మార్పులూ ముఖ్యమే. ఒకేసారి తీవ్రంగా నీటి విరేచనాలు వచ్చినా అతిసార కిందే లెక్క.
ఏది కాదు?
ఇలా వ్యాపిస్తుంది..
మలంలోని బ్యాక్టీరియా, వైరస్లు కలుషితమైన నీరు, ఆహారం ద్వారా నోటిగుండా పేగులకు చేరుకొని వ్యాధిని కలిగిస్తాయి. వ్యాధి వ్యాప్తిలో కీటకాలు, ముఖ్యంగా ఈగలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో, జన సమూహం ఎక్కువగా ఉండే యాత్రాస్థలాలలో వ్యాధి వ్యాప్తికి ఆస్కారం ఎక్కువ. కాబట్టి పసిబిడ్డల తల్లులు ఆ గుంపులకు దూరంగా ఉండటమే మంచిది.
– డాక్టర్ కర్రా రమేశ్రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు