యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూత్ అడ్డా లాంటివి. కానీ,
అరవైలు దాటాక సోషల్ మీడియాలోకి వచ్చి.. మంచి ఫ్యాన్ బేస్ను సొంతం చేసుకున్నారు
హైదరాబాద్కు చెందిన జయశ్రీ. తన అనుభవాలు, అనుభూతుల వేదిక.. ‘జయశ్రీస్ వ్లాగ్స్’ యూట్యూబ్ ఛానెల్ దాదాపు ఆరు లక్షల మంది సబ్స్ర్కైబర్లతో దూసుకుపోతున్నది. జయశ్రీకి ఇద్దరు కూతుళ్లు. ఒకరు అమెరికాలో, ఒకరు ఆస్ట్రేలియాలో ఉంటారు. కూతుర్ని చూసేందుకు అమెరికా వెళ్లిన జయశ్రీ కొవిడ్ కారణంగా అక్కడే ఇరుక్కు పోయారు. కొన్నాళ్లు గడిచాక తన జీవితానుభవాలను పదిమందితో పంచుకోవాలన్న ఉద్దేశంతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు.
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వ్యవసాయ కుటుంబంలో పుట్టిన జయశ్రీకి సేద్యం, కుట్లు, అల్లికలు, వంటలు ఎంతో ఇష్టం. కొత్త రుచులు, వినూత్నమైన ఎంబ్రాయిడరీ తదితర విషయాల్ని తన వీడియోల్లో చెబుతారు. అంతేకాదు, అమెరికాలో తాను తిరిగిన ప్రదేశాలు, పాల్గొన్న వేడుకలు.. మొత్తంగా అక్కడి సంగతులన్నీ ఛానెల్ ద్వారా పంచుకుంటారు. పెళ్లికి వెళ్లినా, పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్నా, షాపింగ్ చేసినా.. పూసగుచ్చినట్టు షేర్ చేసుకునే జయశ్రీస్ వ్లాగ్స్ పక్కా లైఫ్ైస్టెల్ ఛానెల్ అని చెప్పొచ్చు. పెద్ద వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా కబుర్లు చెబుతూ వేలమంది అభిమానాన్ని చూరగొన్న జయశ్రీ ఎందరికో స్ఫూర్తి ప్రదాత.