మధువులు పలు రకాలు. మేలైన వాటిని ఎంచుకొని రుచి చూస్తారు సురప్రియులు. ఇప్పుడు వీరి కోసం వంద శాతం గంజి విస్కీ.. అందుబాటులోకి వచ్చింది. రైస్ విస్కీ కొత్తగా రావడం ఏమిటి? ఎప్పట్నుంచో ఉన్నదే కదా! అంటారా!! ఈ ప్యూర్ రైస్ విస్కీ ఇండియా తొలి ఉత్పత్తి కావడమే దీని ప్రత్యేకత. బివరేజ్ ఆల్కహాల్ కంపెనీ ఇండియా, యునైటెడ్ ఎపిటొమి రిజర్వ్ సంయుక్తంగా ఈ విస్కీని తయారు చేశాయి. పంజాబ్ చేలల్లో పండిన ధాన్యాన్ని గోవాలోని కంపెనీలో మూడేండ్లు పులియబెట్టి, అంచెలంచెలుగా ఈ విస్కీని తయారు చేశారు. 2,000 విస్కీ సీసాలను మాత్రమే మార్కెట్లోకి విడుదల చేశారు.