ఇన్స్టాగ్రామ్లో తనను ఫాలో అవుతున్న వారందరికీ థ్యాంక్స్ చెబుతున్నది నటి రకుల్ ప్రీత్ సింగ్. అభిమానుల వల్లే తను ఈ స్థాయికి చేరుకున్నానని అంటున్నది. ‘సినిమాలు చూడటం తప్ప అందులో నటించాలని, నటిస్తానని ఎన్నడూ ఊహించలేదు. అది కూడా హిందీ సినిమాలు మాత్రమే చూసేదాన్ని! నాకు 18 ఏండ్లు ఉన్నప్పుడు మాడలింగ్ ఫీల్డ్లోకి వచ్చాను. నెల తిరిగేసరికి నా ఫొటోలు ఎవరో చూసి నేరుగా మా నాన్నకు ఫోన్ చేసి సినిమా కోసం అడిగారు. సినిమాలతో పరిచయం లేకున్నా.. మళ్లీ వాళ్లు సంప్రదించినప్పుడు ఓకే చెప్పాను. కేవలం పాకెట్ మనీ కోసం సినిమాల్లో చేయాలనుకున్నా.
అదొక్కటే కారణం కాదు, మా స్నేహితుల్లో నేను బిజీ పర్సన్ అవ్వాలనే ఆరాటంతో సినిమాల్లో నటించడానికి ముందుకొచ్చా’ అని చెప్పుకొచ్చింది రకుల్. మొదటి సినిమా ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించడంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. టాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్లోనూ పాగా వేసింది. ఇన్స్టాలో చేరిన్నాటి నుంచి రకుల్కు ఫాలోవర్స్ పెరుగుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు పోస్టులు అప్లోడ్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుందామె. ఈ క్రమంలో లక్షలాదిగా అభిమానులను సంపాదించుకుంది.