కావలసిన పదార్థాలు
రాగులు: ఒక కప్పు, మినుప పప్పు: పావు కప్పు, అటుకులు: రెండు టేబుల్ స్పూన్లు, మెంతులు: ఒక టీస్పూన్,
ఉప్పు: తగినంత, నూనె: కొద్దిగా.
తయారీ విధానం: రాగులు, మినుప పప్పు, మెంతులను బాగా కడిగి విడివిడిగా నాలుగు గంటలపాటు నానబెట్టాలి. పిండి రుబ్బుకోవడానికి ముందు పది నిమిషాల పాటు అటుకులు నానబెట్టాలి. మిక్సీ జార్లో రాగులు, మినుప పప్పు, మెంతులు, అటుకులు వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి అయిదు గంటలపాటు నానబెట్టాలి. మిశ్రమంలో తగినంత ఉప్పు కలపాలి. స్టవ్మీద లోతుగా, మందంగా ఉన్న కడాయి పెట్టి బాగా వేడయ్యాక పిండి మిశ్రమం వేసి.. అంచులు పట్టుకుని చుట్టూ పరుచు కునేలా తిప్పాలి. చుట్టూ నూనెవేసి మూతపెట్టి రెండు నిమిషాలు సన్నని మంటపై ఉంచితే రాగి ఆపమ్ సిద్ధం. పల్లీ పచ్చడి అదిరిపోయే కాంబినేషన్.