తాతయ్య మరణించాడు. అమ్మమ్మ చనిపోయింది. అమ్మవైపు బంధువులంతా ఒక్కొక్కరుగా దూరమైపోయారు. కారణం.. ఆ ఊరి చెరువు. అందులోని కలుషిత జలాలు. ఆ కుదుపుతో ఆయేషా సిద్దిఖీలో పర్యావరణ స్పృహ మొదలైంది.
‘ప్రకృతి మనకు జీవితాన్ని ఇచ్చింది. మనం మాత్రం ప్రకృతికి కాలకూట విషాన్ని తిరిగి ఇస్తున్నాం’ అంటుంది ఆ పాకిస్థానీ యువతి.
‘పొల్యూటర్స్ అవుట్’ పేరుతో ఆమె ప్రారంభించిన ఉద్యమం ప్రపంచమంతా విస్తరించింది. ఆ చిత్తశుద్ధికి మెచ్చే ‘టైమ్’ పత్రిక ఆయేషాను ‘విమెన్ ఆఫ్ ది ఇయర్’గా ప్రకటించింది. ముఖచిత్రంగా ముద్రించింది.