కావలసిన పదార్థాలు
పైనాపిల్ ముక్కలు: ఒక కప్పు, పచ్చికొబ్బరి తురుము: అరకప్పు, ఉల్లిగడ్డ: ఒకటి, అల్లం: అంగుళం ముక్క, పెరుగు: అరకప్పు, ఆవాలు,
జీలకర్ర, పసుపు: అర టీస్పూన్ చొప్పున, బెల్లం: చిన్న ముక్క, కొబ్బరి నూనె: రెండు టేబుల్ స్పూన్లు, కరివేపాకు: రెండు రెబ్బలు, ఎండు మిర్చి: రెండు, పచ్చిమిర్చి: నాలుగు, ఉప్పు: తగినంత.
తయారీ విధానం
గిన్నెలో పైనాపిల్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, పసుపు వేసి అరకప్పు నీళ్లుపోసి సన్నని మంటపై పది నిమిషాలపాటు ఉడికించాలి. నీళ్లన్నీ ఇగిరిపోయాక, మెత్తగా రుబ్బిన పచ్చికొబ్బరి పేస్ట్వేసి మరో రెండు నిమిషాలు మగ్గించాలి. ఆ తర్వాత బెల్లం వేసి దించి, పక్కన పెట్టుకోవాలి. కాస్త చల్లారాక, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్మీద మరోపాన్ పెట్టి కొబ్బరి నూనె వేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేయాలి. బాగా వేగాక.. కాస్త చల్లార్చి, పైనాపిల్ మిశ్రమంలో కలుపుకొంటే పైనాపిల్ పెరుగు పచ్చడి సిద్ధం.