Jodhaiya Bai Baiga | ‘నేర్చుకోవడం ఆపేసినప్పుడే మనం ముసలివాళ్లం అయిపోయినట్టు’ అంటారో రచయిత. అదే సూత్రాన్ని పాటిస్తారు మధ్యప్రదేశ్లోని లోహ్రా గ్రామానికి చెందిన జుధయా బాయ్ బైగా. కట్టెలు, పిడకలు అమ్ముకుంటూ జీవనం సాగించేది జుధయా. హఠాత్తుగా ఆమె మనసు చిత్రకళ మీదికి మళ్లింది. ఏడు పదుల వయసులో బొమ్మలేయడం నేర్చుకుని దేశవిదేశాల్లో గుర్తింపు తెచ్చుకున్నది. ఇటీవల, తన ఎనభై రెండో ఏట కేంద్ర నారీశక్తి పురస్కారాన్నీ అందుకున్నది.
జుధయా బాయ్ బైగా తోటి ఆదివాసీలలానే అడవుల మీద ఆధారపడి జీవించేది. భర్త కూలీ పనులు చేసేవాడు. పన్నెండేండ్ల క్రితం ఆశిష్ స్వామి అనే ప్రఖ్యాత చిత్రకారుడు లోర్హా గ్రామానికి వెళ్లాడు. ఆదివాసీ జీవనశైలిని ముందుతరాలకు తెలియజేయాలన్నది ఆయన ఉద్దేశం. ఆ ఆలోచనతోనే ఇక్కడి ఆదివాసీలకు ఉచితంగా చిత్రలేఖనం బోధించాడు. అప్పటికి బైగా వయసు అరవై తొమ్మిది. తానూ ఓ ప్రయత్నం చేద్దామనుకున్నది. కుంచె పట్టగానే క్యాన్వాస్తో అనుబంధం ఏర్పడింది. రకరకాల రంగులను మేళవిస్తూ చుట్టూ కనిపించే ప్రకృతికి ఊపిరిపోసింది. చెట్టూ, పుట్టా, ఆకాశం, జంతువులూ… ఇలా ఏది గీసినా ఆదివాసీ వాతావరణంలోని స్వచ్ఛత కనిపించేది ఆ చిత్రాల్లో. ఆర్ట్ ఎగ్జిబిషన్లలో ఆమె పెయింటింగ్స్ వేల రూపాయలు పలికాయి. ఇటలీ, ఫ్రాన్స్ లాంటి దేశాల్లోనూ గుర్తింపు తెచ్చుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం నారీశక్తి పురస్కారంతో సత్కరించింది. రోజంతా పొలం పనులకు వెళ్లినా విరామ సమయంలో బొమ్మలు గీయడమే తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అంటున్నది బైగా.
“Namma Katte | మహిళలు మనసు విప్పి మాట్లాడుకునేందుకు ఇదొక మంచి వేదిక”
మొఘలాయి వంటకాలను ఇప్పటి తరానికి రుచి చూపిస్తున్నరు !!”
టాలీవుడ్ మొదలు బాలీవుడ్ స్టార్స్ అందరితో ఇన్స్టా రీల్స్ చేయించగలిగే ఈ అమ్మాయి ఎవరో తెలుసా!!”
ఐటీ కొలువులు వదులుకుని కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్న మహిళలు.. ఎందుకంటే..”