వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంత వేగంగా జరిగితే అంత త్వరగా మన దేశం కరోనా ఊబినుంచి బయట పడుతుంది. ఈ మహాయజ్ఞంలో ప్రతి నిమిషం విలువైందే. మన కారణంగా ఓ ఐదు నిమిషాలు ఆలస్యమైందంటే, పరోక్షంగా ఒకరికి టీకా సకాలంలో అందనట్టే. కాబట్టి, తగిన ఏర్పాట్లతో టీకా కేంద్రానికి వెళ్లండి.