‘కిరాక్ పార్టీ’తో టాలీవుడ్లో అడుగు పెట్టిన కన్నడ కస్తూరి.. రశ్మిక మందన్న. ‘గీత గోవిందం’తో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ‘పుష్ప’తో పాన్ ఇండియా కథానాయిక అయ్యింది. ‘సీతారామం’ సక్సెస్ నుంచి తేరుకోకముందే మరో జాక్పాట్ కొట్టేసింది రశ్మిక. ‘గుడ్ బై’ అంటూనే అమితాబ్తో కలిసి బాలీవుడ్లో కొత్త జర్నీ మొదలుపెట్టింది.
గడిచిన రెండేండ్లుగా చాలా హ్యాపీగా ఉన్నా. నా జీవితంలో ఇవి మరిచిపోలేని క్షణాలు. ‘పుష్ప’ పాన్ ఇండియా సినిమా కావడంతో తెలుగు హిందీ ప్రేక్షకులకు దగ్గరైనా.. మొదటిసారి నేరుగా హిందీ చిత్రంలో నటించడం చాలా గొప్ప అనుభూతిని ఇచ్చింది. ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీల మధ్య గీతలు చెరిగిపోతున్నాయి. భారతీయ సినీ పరిశ్రమకు ఇది శుభపరిణామం.
అమితాబ్ లాంటి లెజెండ్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో ఎలా పనిచేస్తానో అని మొదట్లో చాలా కంగారుపడ్డాను. కానీ, బచ్చన్ సాబ్ను కలిసిన తర్వాత బెరుకంతా మాయమైంది. నన్నెంతో ఆదరించారు. ఆయన నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను.
‘గుడ్ బై’ అవకాశం మొదటి లాక్డౌన్ సమయంలో వచ్చింది. ఇప్పటివరకు నేను ఏకబిగిన స్క్రిప్ట్ చదివిన సందర్భాలు లేవు. ‘గుడ్ బై’ స్క్రిప్ట్ గంటన్నరలో.. సింగిల్ సిట్టింగ్లో చదివేశా. అంత గొప్పగా ఉంది. అందుకే వెంటనే ఓకే చెప్పాను.
అమితాబ్ సార్ కూడా ఇందులో ఉన్నారని తెలిశాక, మరింత ఆసక్తి కలిగింది.
ప్రతి సినిమా నాకు ప్రధానమైనదే. 2016లో మొదటి సినిమా ‘కిరాక్ పార్టీ’లో నటించకపోతే పుష్ప అవకాశం ఎక్కడిది? అయితే, కొన్ని పాత్రలకు ప్రేక్షకుల నుంచి ఊహించని ఆదరణ లభిస్తుంది. అలాంటి పాత్రలు మన పురోగతికి దోహదం చేస్తాయి.
ఒకే సినిమాతో బాలీవుడ్కి ‘గుడ్ బై’ చెబుతాను అనుకోకండి. ఇక్కడ నా జర్నీ ఇప్పుడే మొదలైంది. మరికొన్నాళ్లు కొనసాగుతుంది. మరిన్ని సినిమాలు చేస్తాను. హృతిక్రోషన్, రణ్వీర్సింగ్ తదితర నటులతో కలిసి పనిచేయాలని ఉంది.