ఈ మధ్య ఓ విదేశీ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ హఠాత్తుగా మరణించారు. మితిమీరిన డైటింగ్ ఇందుకు కారణమని నిపుణులు తేల్చారు. చివరి దశలో ఆ ఇన్ఫ్లుయెన్సర్ పోషక విలువల లోపంతో ఇబ్బంది పడినట్టు తెలుస్తున్నది. గత ఐదేండ్లుగా ఆమె పండ్లు, పొద్దుతిరుగుడు గింజలు, మొలకలు, స్మూతీల మీదే బతికేస్తున్నారు. వీటివల్ల కొన్ని పోషకాలు అపారంగా లభిస్తాయి. ఇంకొన్ని అస్సలు అందవు. దీంతో సమతౌల్యం లోపిస్తుంది. ఏ ఆహార విధానమైనా.. హద్దులు దాటితే ప్రాణాంతకమే.