కావలసిన పదార్థాలు
డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు: ఒక కప్పు (ఎరుపు), అరటి పండు: ఒకటి, ఖర్జూరాలు: ఆరు, యాలకుల పొడి: పావు టీస్పూన్, అల్లం తురుము: పావు టీస్పూన్.
తయారీ విధానం
అరటిపండు, డ్రాగన్ ఫ్రూట్ ముక్కల్ని నాలుగు గంటలపాటు డీప్ ఫ్రిజ్లో పెట్టాలి. ఖర్జూరాల గింజలు తీసేసి, రెండు గంటలపాటు నాన బెట్టాలి. జ్యూస్ జార్లో అరటిపండు, డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు, ఖర్జూరాలు, యాలకులపొడి, అల్లం తురుము వేసి, తగినన్ని నీళ్లుపోసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులోకి తీసుకుని పైనుంచి తాజా డ్రాగన్ ఫ్రూట్ ముక్కలతో అలంకరించుకుంటే చల్లచల్లని స్మూతీ సిద్ధం.