దీపావళికి బంగారం, వెండి బహుమతిగా ఇస్తుంటారు. ఇదొక శుభప్రదమైన ఆచారం. ఈ సంప్రదాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నది జైపూర్ వాచ్ కంపెనీ. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. ఆ కంపెనీ 1947 నుంచీ భారతీయ కరెన్సీలో ఓ వెలుగు వెలిగిన రూపాయి నాణేలను బంగారు, వెండితో కొత్తగా తయారు చేయించి, వాటిని వాచ్లలో పొందుపరిచింది.
కొత్తదనాన్ని కోరుకునేవారు ఈ చేతి గడియారాలను ప్రియమైన వారికి దీపావళి కానుకగా ఇస్తున్నారు. ధర రూ.45వేల నుంచి రూ.50వేల మధ్య పలుకుతున్నది.