రసాయనాల్లో ముంచి తేల్చిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కలుషితమైన నీటితో, కెమికల్స్ ఆధారంగా తయారయ్యే ఆహార పదార్థాల వల్ల రొమ్ము కణజాలంలోని ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల ఉత్పత్తి విపరీతంగా పెరిగి బ్రెస్ట్ క్యాన్సర్కు దారితీస్తున్నదట. ఈ విషయాన్ని స్ప్రింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ, రీసెర్చ్ డైరెక్టర్ రుతాన్ రుడెల్ నిర్ధారించారు. ‘ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లకూ రొమ్ము క్యాన్సర్కూ మధ్య సంబంధం నిర్ధారణ అయ్యింది. సరైన ఆహారం తీసుకోవడం ద్వారానే సమస్యను కట్టడి చేయగలం’ అని చెబుతున్నారు రుతాన్ .