మోడల్గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నది అంజులా మ్యా సింగ్ బాయిస్. పద్దెనిమిదేండ్లకే ఫ్యాషన్ కెరీర్ మొదలుపెట్టిన అంజులా ‘ఇంటర్నేషనల్ బోర్డ్ ఆఫ్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’కు ఇంటెరిమ్ చీఫ్గా ఎంపికైంది. ఈ అంతర్జాతీయ సంస్థ సామాజిక అంశాలు, పౌర హక్కుల కోసం
పోరాడుతుంది. ముఖ్యంగా మహిళల పట్ల వివక్ష, సమానత్వం విషయంలో చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తున్నది. అంజులా మోడల్గా ఎన్నో ఫ్యాషన్ షోలలో పాల్గొన్నది. ర్యాంప్ వాక్ చేయడం, మ్యాగజైన్ కవర్ పేజీల కోసం ఫొటోలకు పోజులివ్వడం ఆమెకు పెద్దగా తృప్తినివ్వలేదు. చదువుపై దృష్టి సారించి సైకాలజీలో పీహెచ్డీ చేసింది. సైకాలజిస్ట్గా, ఫెమినిస్ట్గా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకుంది.
“నా అంతిమ లక్ష్యం ఎప్పుడూ మోడలింగ్ కాదు. సైకాలజిస్ట్గా పనిచేయాలన్నదే నా కోరిక. ఫెమినిజంపై ప్రజల్లో ఉన్న అపోహలను దూరం చేసేందుకు నా వంతుగా కృషి చేస్తున్నాను. బాధితుల పక్షాన పోరాడేందుకు నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఈ కొత్త బాధ్యతతో నా సేవలను మరింత విస్తృతం చేయాలని ఆశ పడుతున్నా” అంటున్నది అంజులా. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో చదువుకునే రోజుల్లోనే తనకు ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్స్లో కనిపించే అవకాశం వచ్చింది. కానీ, గట్టిగా తిరస్కరించింది.