శర్వానంద్ ‘రణరంగం’తో తెలుగు తెరకు పరిచయమైన తార.. మాయా నెల్లూరి. హైదరాబాద్కు చెందిన ఈ నటి చిత్రకళలోనూ ప్రతిభావంతురాలే. ఆ మధ్య, లాక్డౌన్ కారణంగా ఆస్ట్రేలియాలో లాక్ అయిపోయింది మాయ. అలాగని బాధపడిపోకుండా ఆన్లైన్లో డిజిటల్ ఆర్ట్ నేర్చుకుని, అక్కడే ప్రదర్శన ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. పెద్ద చదువులు చదివిన మాయ.. పలు వ్యాపార సంస్థలకు ఆర్ ్టవర్క్ చేసింది. తను గీసిన చిత్రాలతో హైదరాబాద్లో ఎగ్జిబిషన్స్ కూడా నిర్వహించింది. ప్రస్తుతం ‘సమ్వన్ బిగ్‘ అనే సంస్థతో కలిసి ఓ డిజిటల్ ఆర్ట్ సిరీస్ కోసం పనిచేస్తున్నది.
‘ఖాళీగా ఉన్నప్పుడల్లా నేను కుంచెకు పనిచెప్తాను. సినిమా షూటింగ్ల గ్యాప్లో ఆర్ట్పై దృష్టిపెడతా. నేను యాక్టర్, రైటర్ కాకపోయి ఉంటే గొప్ప పెయింటర్గా స్థిరపడేదాన్నేమో’ అంటూ కళా
ప్రస్థానాన్ని పంచుకున్నది మాయా నెల్లూరి.