వారికీ ఓ పత్రిక!

మదురైకి చెందిన ప్రియ ట్రాన్స్ జెండర్లకు వేదికగా 2017లో మదురైలో ‘ట్రాన్స్జెండర్ రిసోర్స్ సెంటర్'ను స్థాపించారు. ఈ సెంటర్లో మూడో ప్రకృతి వ్యక్తులకు సంబంధించిన న్యూస్ పేపర్ క్లిపింగులు, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్ములు, ప్రభుత్వ జీవోలు ఉంటాయి. గత నవంబర్లో ‘ట్రాన్స్ న్యూస్' పేరుతో ఓ ప్రత్యేక వెబ్ పత్రికను మొదలుపెట్టారు ప్రియ. దీనిలో ప్రచురితమయ్యే వ్యాసాలన్నీ ట్రాన్స్జెండర్లు రాసినవే. ఫ్యాషన్, బ్యూటీ, గృహాలంకరణ, ఆరోగ్యం వంటి అంశాలపైనా కథనాలు ఉంటాయి. ఉద్యోగ సమాచారాన్ని కూడా అందుబాటులో ఉంచుతున్నారు. మోడలింగ్లోకి అడుగుపెట్టిన ట్రాన్స్జెండర్లకు ప్రచారం కల్పిస్తున్నారు. తొలి ట్రాన్స్జెండర్ న్యూస్రీడర్ పద్మినీ ప్రకాశ్ గురించి కథనం ఇచ్చారు. ట్రాన్స్ ఆంత్రప్రెన్యూర్ జీవా రంగరాజ్ ఇంటర్వ్యూను ప్రచురించారు. ‘ట్రాన్స్ న్యూస్' చందా ఉచితం. ప్రస్తుతం ఈ పత్రిక ఇంగ్లిష్, తమిళ భాషల్లో వెలువడుతున్నది. త్వరలోనే హిందీ, మరాఠీ, తెలుగు, కన్నడ భాషల్లోనూ తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
తాజావార్తలు
- నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి ‘మహా’ నమూనాలు
- ఇండో-పాక్ సంబంధాల్లో కీలక పరిణామం.. మళ్లీ చర్చలు షురూ!
- రెచ్చిపోయిన పృథ్వీ షా.. మెరుపు డబుల్ సెంచరీ
- కఠిక పేదరికాన్ని నిర్మూలించాం.. ప్రకటించిన చైనా అధ్యక్షుడు
- కళ్లు దుకాణాల్లో సీసీ కెమెరాలు
- షాకింగ్ : పక్కదారి పట్టిందనే ఆగ్రహంతో భార్యను హత్య చేసి..
- క్రికెట్లో ఈయన రికార్డులు ఇప్పటికీ పదిలం..
- పవన్ కళ్యాణ్తో జతకట్టిన యాదాద్రి చీఫ్ ఆర్కిటెక్ట్
- వీడియో : గంటలో 172 వంటకాలు
- ఫలక్నుమాలో భారీగా లభించిన పేలుడు పదార్థాలు