మన్సూరాబాద్, ఏప్రిల్ 27: కరోనాతో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృ తి చెందాడు… అయితే చికిత్స డబ్బు లు మొత్తం చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఓ ప్రైవేటు దవాఖాన యాజమాన్యం తెలిపింది. అయితే.. మృతుడి కుటుంబ సభ్యుల ఆందోళ న, పోలీసుల జోక్యంతో ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు. కాగా.. మూడు రోజులుగా మృతదేహాన్ని దవాఖానలోనే ఉంచుకోవడంతో యాజమాన్యం వ్యవహరించిన తీరుపట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చో టుచేసుకున్నది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సైనిక్పురికి చెందిన డేనియల్ ఫ్రాంక్లిన్ (41) ప్రైవేటు ఉద్యోగి. ఇటీవల కరోనా పాజిటివ్గా రాగా ఈనెల 17న అతడిని నాగోల్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించారు.
చికిత్స కోసం రూ. 3 లక్షలు చెల్లించారు. చికిత్స పొందుతూ ఈనెల 25న అతను మృతిచెందాడు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబీకులు ప్రయత్నించగా.. మరో రూ. 6 లక్షలు చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. డబ్బుల కోసం ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో మంగళవారం కుటుంబీకులు దవాఖానకు వచ్చి మృతదేహాన్ని అప్పగించాలని కోరారు. డబ్బులు ఇస్తేనే మృతదేహాన్ని ఇస్తామన్నారు. దీంతో వారు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దవాఖాన నిర్వాహకులతో మాట్లాడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై ఆస్పత్రి వర్గాలను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. సమాచారం ఇచ్చేందుకు ముందుకు రాలేదు.