ఎర్రగడ్డ, ఏప్రిల్ 19: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బల్దియా అధికారులతో కలిసి సోమవారం ఎర్రగడ్డ డివిజన్లో పర్యటించారు. బల్దియా ఇంజినీరింగ్ విభాగం అధికారులు రాజ్కుమార్, ఆనంద్, నాగేంద్ర, శ్రీనివాస్లకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎర్రగడ్డ డివిజన్లోని సంజయ్నగర్ సహా పలు బస్తీలు యూసుఫ్గూడ, కూకట్పల్లి సర్కిళ్ల సరిహద్దులో ఉన్నాయన్నారు. ఇరు సర్కిళ్లకు చెందిన అధికారులు సమన్వయంతో పని చేస్తూ ఎప్పటికప్పుడడూ సమస్యలకు చెక్ పెట్టాలని పేర్కొన్నారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ విషయంలో సంజయ్నగర్ కాలనీ వాసులు చాలా ఏండ్లుగా ఇబ్బందులు పడ్డారని.. ఆ సమస్యను పరిష్కరించచామని అన్నారు. ప్రధాన పైప్లైన్ల అనుసంధానం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని.. లేని పక్షంలో సమస్య తరచూ ఉత్పన్నమౌతుందని వివరించారు. ఇరు సర్కిళ్ల ఉన్నతాధికారులతో తనతో పాటు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇదివరకే సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని.. మరో సారి సమావేశమౌతామని వివరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మహ్మద్షరీఫ్, డివిజన్ అధ్యక్షుడు డి. సంజీవ, పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.