ఒడిశాలోని మహిళా స్వయం సహాయక బృందాలు పద్నాలుగు జిల్లాల ప్రజలకు చిరు ధాన్యాల రుచులు అందిస్తున్నాయి. త్వరలోనే మరిన్ని ‘మిల్లెట్ శక్తి కేఫ్’లు ప్రారంభం కానున్నాయి. ఇక్కడ రాగి జావ, రాగి బిస్కెట్లు, కొర్ర ఉప్మా, సామల పాయసం వగైరా రుచులు అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా తనవంతు సాయం అందిస్తున్నది. ఈ కేఫ్ల ప్రభావం అపారం. జనానికి పౌష్టికాహారం అందుతుంది, క్రమంగా ఆహార విధానంలో మార్పు మొదలవుతుంది, అన్నిటికీ మించి కొన్ని వందలమంది మహిళలకు ఉపాధి లభిస్తుంది. మంచి ప్రయత్నమే!