గీసుగొండ, నవంబర్9: ఉద్యోగ సాధనలో సంకల్ప బలం ఉండాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఊకల్ కాకతీ య మెగా టెక్సటైల్ పార్కులో చల్లా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఫిజికల్ ఈవెంట్స్ శిక్షణ శిబిరాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అభ్యర్థులతో కలిసి రన్నింగ్, షాట్పుట్ ఆడారు. అనంతరం మాట్లాడుతూ పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ప్రిలిమి నరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఫిజి కల్, మెయిన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉద్యో గాలను సొంతం చేసుకోవాలని పేర్కొన్నారు.
గ్రా మాల్లోని పేద విద్యార్థుల కోసం ఉచిత శిక్షణ శిబి రాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వెంట్స్ రోజు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు నిర్వ హించనున్నామన్నారు. యువత సద్వినియో గం చేసుకోవాలని ఆయన కోరారు. మామునూరు ఏసీపీ నరేశ్కుమార్, గీసుగొండ, సంగెం జడ్పీ టీసీలు పోలీసు ధర్మారావు, గూడ సుదర్శన్రెడ్డి, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు దేవేందర్రెడ్డి, వెంక న్న, దేవేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరగోని రాజుకుమార్, మండల కార్యదర్శి వేణు గోపాల్రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు శ్రీకాం త్, వివిధ గ్రామాల సర్పంచులు జైపాల్రెడ్డి, బో డకుంట్ల ప్రకాశ్, గోనె మల్లారెడ్డి, బాబు, ఊకల్ ఎంపీటీసీ వీరారావు తదితరులు పాల్గొన్నారు.