రాయపర్తి, జనవరి 26 : యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ సమయాన్ని వృథా చేసుకోకుండా స్వయం ఉపాధి రంగాలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. మండల కేంద్రంలో మాజీ జడ్పీటీసీ ఆకుల అరుంధతి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ సురేందర్రావుల కుమారుడు సిద్ధార్థ ఏర్పాటు చేసుకున్న ఆకుల ట్రేడర్స్ను, విశ్రాంత ఉపాధ్యాయురాలు పెదగోని ప్రమీల, గౌడ సంఘం మాజీ మండలాధ్యక్షుడు పెదగోని వెంకటవరప్రసాద్-పద్మ దంపతులు ఏర్పాటు చేసుకున్న శ్రీ రాజరాజేశ్వరీ బిల్డింగ్ మెటీరియల్స్ దుకాణాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత యువతీయువకుల్లో సృజనాత్మకతకు కొదువలేదని తెలిపారు. స్వయం ఉపాధి రంగంలో ప్రభుత్వం అందజేస్తున్న ప్రత్యేక పథకాలు, రాయితీ స్కీంలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, రాయపర్తి సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీటీసీలు బిల్ల రాధిక, అయిత రాంచందర్, నాయకులు పూస మధు, మహ్మద్ ఉ స్మాన్, అక్బర్, పోగులకొండ వేణు, పురం అనిల్కుమార్, మందాడి సుదర్శన్రెడ్డి, ఎలమంచ శ్రీనివాస్రెడ్డి, ముద్రబోయిన సుధాకర్, చం దు రామ్యాదవ్, సతీశ్యాదవ్, నాగపురి రాంబాబు, చెవ్వు సతీశ్కుమార్, కుందూరు రాంచంద్రారెడ్డి, యాదగిరిరెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. మండలంలోని కొండూరు గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ ఉన్నత పాఠశాలలో మన ఊరు-మన బడి పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన సరస్వతీ మాత విగ్రహాన్ని సర్పంచ్ కర్ర సరిత, ఎంపీటీసీ చిర్ర ఉపేంద్ర, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ కర్ర ప్రవీణ్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన ఊరు-మన బడి పనులతో ప్రభుత్వ విద్యాలయాలన్నీ కార్పొరేట్కు దీటుగా తయారవుతున్నట్లు చెప్పారు. ప్రజలంతా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు దేశబోయిన ఉపేందర్, పీఏసీఎస్ చైర్మన్ జక్కుల వెంకట్రెడ్డి, నాయకులు పోల్నేని శ్యాంరావు, వీరమనేని సత్యనారాయణరావు, పులి సోమయ్య, గుండె రామస్వామి, పెండ్లి వెంకన్న, నేరెళ్లి రాములు, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
పర్వతగిరి : తెలంగాణా గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పర్వతగిరిలోని ఆయన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గెజిటెడ్ అధికారుల సహకారంతో ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందజేస్తున్నామని, జిల్లా అభివృద్ధికిఉద్యోగులు, అధికారులు కృషి చేయాలని కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీజీవో సంఘ భవన నిర్మాణానికి ప్రభుత్వ భూమి కేటాయించడానికి ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీజీవో ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ అన్నమనేని జగన్మోహన్రావు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షుడు అంజద్అలీ, కార్యదర్శులు ఫణికుమార్, డాక్టర్ ప్రవీణ్కుమార్, కిరణ్కుమార్గౌడ్, కోశాధికారులు నాగనారాయణ, ఈగ వెంకటేశ్వర్లు, డీసీవో సంజీవరెడ్డి, సీపీవో జీవరత్నం, అన్వర్ హుస్సేన్, సంతోష్, పాక శ్రీనివాస్, డాక్టర్ మహేశ్కుమార్, మాధవరెడ్డి, రఘుపతిరెడ్డి, రాజేశ్కుమార్గౌడ్, డాక్టర్ సుధీర్కుమార్, రామ్చందర్రావు, రాజేశ్కుమార్, లక్ష్మణ్రావు, అస్నాల శ్రీనివాస్, హాలునాయక్, అజార్షరీఫ్, బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు.