చిల్పూరు, డిసెంబర్ 13 : ఇటీవల మృతిచెందిన బీఆర్ఎస్ జనగామ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి కుటుంబసభ్యులను అండగా ఉంటామని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం రాజవరంలో సంపత్రెడ్డి సంతాప సభకు వారు హాజరయ్యారు. పాగాల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులు సంపత్రెడ్డి, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్లను బీర్ఎస్ పార్టీ కోల్పోవడం బాధాకరమన్నారు. సంపత్రెడ్డి కుటుంబానికి ఆర్థికంగా, అండగా పార్టీ ఉంటుందని హామీ ఇచ్చారు. ఆయన కుమార్తెకు ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ.. జడ్పీ చైర్మన్ సంపత్రెడ్డితో 14 సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నానని, స్టేషన్ఘనపూర్, జనగామ అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ గెలుపొందిన తెల్లారే సంపత్రెడ్డి గుండెపోటుతో మృతి చెం దడం బాధాకరం అన్నారు.
2001లో కేసీఆర్ పి లుపుతో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పా ల్గొన్నారన్నారు. సంపత్రెడ్డి పార్టీకి చేసిన సేవలను గుర్తించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనగామ జిల్లా పరిషత్ చైర్మన్తో పాటు పార్టీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించారని పేర్కొన్నారు. శాసనసభ మండలి చైర్మన్ ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య నివాళులర్పించారు. కార్యక్రమంలో సంపత్రెడ్డి తండ్రి జయపాల్రెడ్డి, అన్నదమ్ములు వెంకట్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ మారెపల్లి తిరుమలాకృష్ణమోహన్రెడ్డి, ఎంపీటీసీ మారెపల్లి లలితాదేవీశ్యామ్కుమార్రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మామిడాల లింగారెడ్డి, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ జనగామ యాదగిరి, మాజీ దేవస్థానం డైరెక్టర్ గజ్జెల దామోదర్, తెలంగాణ గౌడ సంఘం మండలాధ్యక్షుడు తాళ్లపల్లి జగన్నాథం, మండలాధ్యక్షుడు భూక్యా రమేశ్ నాయక్ పాల్గొన్నారు.