పర్వతగిరి, ఫిబ్రవరి 15: సంత్ సేవాలాల్ మహరాజ్ చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడువాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పిలుపునిచ్చారు. సేవాలాల్ 284వ జయంతిని బుధవారం మండలకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా అరూరి పాల్గొని సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు. అనంతరం గిరిజన మహిళలతో కలిసి ఆయన నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ సేవాలాల్ కేవలం గిరిజనులకే కాదని, అందరికీ ఆరాధ్యుడన్నారు. గిరిజనులకు దశదిశ చూపి, హైందవ ధర్మం గొప్పదనం, విశిష్టతను తెలియజేయడానికి సేవాలాల్ మహరాజ్ జన్మించారని చరిత్రకారులు చెబుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 24 కోట్లతో గిరిజనుల ఆత్మగౌరవం ప్రతిబింబించేలా సేవాలాల్ బంజారా భవనాన్ని ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లో నిర్మించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో హనుమకొండ జడ్పీ వైస్ చైర్పర్సన్ గజ్జెల శ్రీరాములు, డీసీవో సంజీవరెడ్డి, ఎంపీపీలు కమలా పంతులు, అన్నంనేని అప్పారావు, జడ్పీటీసీలు సింగ్లాల్, మార్గం భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్లు రాజేష్కన్నా, మనోజ్కుమార్, ఎంపీడీవో రాజ్యలక్ష్మి, చక్రాల సంతోష్కుమార్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సర్వర్, సూపరింటెండెంట్ కస్నా, సర్పంచ్లు వెంకన్ననాయక్, రమేశ్, భాస్కర్, జ్యోతీ లకుపతి, రవి, మాలతీ సోమేశ్వర్రావు, ఎంపీటీసీ రాజు, ఏకాంతంగౌడ్, యుగేంధర్రావు, వైస్ ఎంపీపీ రాజేశ్వర్రావు, గిరిజనులు పాల్గొన్నారు.
నర్సంపేటరూరల్/చెన్నారావుపేట: నర్సంపేట మండలంలోని ముత్యాలమ్మతండా, ఏనుగల్తండాలో సేవాలాల్ జయంతిని వైభవంగా నిర్వహించారు. గోర్సేన ఆధ్వర్యంలో తండావాసులు సేవాలాల్కు పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు భూక్యా సైద, లలిత, ఉత్సవ కమిటీ సభ్యులు భూక్యా రాజేందర్నాయక్, ఉప సర్పంచ్ లకావత్ రవి, తండా పెద్దలు లక్ష్మణ్, ఈరు, నరేశ్, శ్రీను, రాజేశ్, జీవన్, రెడ్యా, మంగ్యా, టీకియా పాల్గొన్నారు. చెన్నారావుపేట మండలం సూర్యాపేటతండా, అమృతండాలో సేవాలాల్ జయంతి సందర్భంగా భోగ్ భండారో కార్యక్రమం నిర్వహించారు. గోర్ సిక్వాడి కో ఆర్డినేటర్ బోడ కిషన్నాయక్, గోర్సేన జిల్లా కో ఆర్డినేటర్ ధరావత్ కిషన్నాయక్, తండా వాసులు వాగ్యానాయక్, బాలాజీనాయక్, ధన్సింగ్నాయక్, ప్రవీణ్నాయక్ పాల్గొన్నారు.