కరీమాబాద్ : అయ్యప్ప స్వాములు ఉర్సులో నిర్వహించే అయ్యప్పస్వామి శోభాయాత్రకు.. మహాపడిపూజకు సహకరించి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం ఉర్సులోని అయ్యప్పస్వామి కుటీరంలో ఉత్సవ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డిసెంబర్ 5న నిర్వహించే అయ్యప్పస్వామి శోభాయాత్రకు బందోబస్తు ఏర్పాట్లు చేస్తానన్నారు. డిసెంబర్ 12న జరిగే మహాపడిపూజకు బల్దియా ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపడుతానని అన్నారు. 18 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో 18 పడులతో ప్రత్యేకంగా పూజ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో ఖిలావరంగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కేడల జనార్దన్, కార్పొరేటర్లు పోశాల పద్మ, మరుపల్ల రవి, కుమారస్వామి మాజీ కార్పొరేటర్ కేడల పద్మ, నాయకులు పోశాల స్వామి, కుమార్, ఈదుల రమేశ్, ఈదుల భిక్షపతి, పాల రంజిత్, అయ్యప్ప సేవా సమితి, అయ్యప్ప పరపతి సంఘం, హరిహరపుత్ర పరపతి సంఘం సభ్యులు పాల్గొన్నారు.