పోచమ్మమైదాన్, అక్టోబర్ 31: ఉక్కు మనిషి సర్దార్ వల్లబాయి పటేల్ జయంతి సందర్భంగా కేంద్ర యువ జన, క్రీడా మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు నెహ్రూ యువ కేంద్రం వరంగల్ ఆధ్వర్యాన రాష్ట్రీయ ఏక్తా దివస్ సంబురాలను పోచమ్మమైదాన్ సెంటర్లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఏసీపీ కలకోట గిరికుమార్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయి పటేల్ అడుగు జాడల్లో యువత నడువాలని పిలుపు ఇచ్చారు. అనంతరం ఆయన జెండా ఊపి మెగా రన్ను ప్రారం భించారు. ఈ రన్ పోచమ్మమైదాన్ నుంచి ఎస్వీపీ రోడ్డు సర్దార్ వల్లబాయి పటేల్ విగ్రహం వరకు కొనసాగింది. కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి చింతల అన్వేశ్, మెప్మా వరంగల్ ఆఫీసర్ రమేశ్, ఎన్ఎస్ఎస్ ఎవీవీ కళాశాల కో ఆర్డినేటర్ శ్రీనివాస్రావు, ఎన్వీకే వలంటీర్లు భరత్ వీర్ తరుణ్, బోస్, రాజ్కుమార్ పాల్గొన్నారు.
ఎల్బీ నగర్లో ..
జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ఎల్బీ నగర్లోని ప్రభుత్వ చార్బౌళి ఉన్నత పాఠశాల విద్యా ర్థులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఎల్బీనగర్, నర్సంపేట రోడ్డు, తిలక్రోడ్డు గుండా ర్యాలీ తీశారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం రామ హ రికృష్ణ, ఉపాధ్యాయులు నవీన్కుమార్, నర్సింగరావు, శ్రీనివాస్, రమేశ్, శ్రవణ్, గంగాధర తిలక్, ఇఫ్తెకార్ అలీ, వేణుమాధవ్, విద్యార్థులు పాల్గొన్నారు.
పర్వతగిరిలో..
పర్వతగిరి: సర్దార్ వల్లబాయి పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ సమైక్యతా దినోత్సవం పర్వతగిరిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉన్నత పాఠశాల నుంచి గ్రామ కూడలి వరకు విద్యార్థులతో కలిసి సమైక్యతా దినోత్సవ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో చౌరస్తాలో మానవహారంగా ఏర్పడారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జలీల్, ఉపాధ్యాయలు కృపాల్, శ్రీధర్, వంశీమోహన్, రమేశ్, రాజు, ప్రతిభ, శాంతికిరణ్, బీ రాజు, హరిలాల్, అశోక్కుమార్, ఎం భాస్కర్, మనోహర్, అనిల్కుమార్, రాధాక్రిష్ణకుమారి, శ్రీధర్, ఉమాదేవి పాల్గొన్నారు.
ఖానాపురంలో..
ఖానాపురం: మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జాతీయ సమైక్యతా దినోత్సవం ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి, రెండో బస్టాండ్ సెం టర్లో మానవహారంగా ఏర్పడ్డారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ మంగ్యానాయక్, కాంప్లెక్స్ హెచ్ఎం దూళం రాజేందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
దుగ్గొండిలో ..
దుగ్గొండి: మండల కేంద్రంలోని ఆదర్శవాణి ఉన్నత పాఠశాల, గిర్నిబావిలోని ఎంజేపీటీ గురుకులంలో, న్యూ విజన్ హైస్కూల్లో సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి ప్రధానోపాధ్యాయుల సమక్షంలో ఘనంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం దేవేందర్, రవి, యుగేందర్, నర్సింహరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మహనీయులను మరువొద్దు
కరీమాబాద్: దేశం కోసం.. ప్రజల కోసం పని చేసిన మహనీయులను మరువద్దని 4వ బెటాలియ న్ కమాండెంట్ శివప్రసాద్రెడ్డి అన్నారు. సోమవా రం మామునూరులోని 4వ బెటాలియన్లో భారతదేశ మాజీ ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జ యంతిని పురస్కరించుకుని ‘ఏక్తాదివస్’ నిర్వహించారు. సీనియర్ అస్టెంట్ కమాండెంట్ వేణుగోపాల్రెడ్డి, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.
నర్సంపేటలో..
నర్సంపేట: నర్సంపేటలోని డఫోడిల్స్ హై స్కూల్ విద్యార్థులతో జాతీయ సమైక్యతా 2కే రన్ ను నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జ యంతి సందర్భంగా జాతీయ సమైక్య దినోత్సవా న్ని ఘనంగా నిర్వహించారు. ఈ రన్ను పాఠశాల చైర్మన్ చింతల నరేందర్ ప్రారంభించారు. పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ రీటా, ఉపాధ్యాయులు వెంకటరత్నం, కార్తీక్, పార్వతి, సుహాసిని పాల్గొన్నారు.
నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి
నర్సంపేట రూరల్: విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని మహేశ్వరం సేయింట్ మేరీ హైస్కూల్ కరస్పాండెంట్ సిస్టర్ మరియా, ప్రిన్సిపాల్ జయప్రద అన్నారు. సోమవారం మండలంలోని మహేశ్వరం గ్రామ శివారు సేయింట్ మేరీ హైస్కూల్లో జాతీయ ఐక్యతా దినోత్సవం, ఉక్కు మనిషి సర్ధార్ వల్లబాయిపటేల్ జయంతిని పురస్కరించుకొని ఎన్సీసీ విద్యార్థులు గ్రామంలోని అన్ని వీధుల్లో ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ ఏఎన్వో లావణ్య, వ్యాయామ ఉపాధ్యాయుడు కందకట్ల సతీష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.