నమస్తే తెలంగాణ నెట్వర్క్,అక్టోబర్ 31; బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై ఉద్యోగులు భగ్గుమన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన, ఆకాంక్షల కోసం ఉద్యోగాలను, ప్రాణాలను ఫణంగా పెట్టి ఉద్యమించిన తమ మనోభావాలు దెబ్బతినేలా చులకనగా మాట్లాడడం శోచనీయమంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈమేరకు ‘బండి’ తీరును నిరసిస్తూ కేంద్ర సంఘం పిలుపుమేరకు సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద టీఎన్జీవోలు నిరసన తెలిపారు. వెంటనే సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
చులకనగా మాట్లాడడం తగదు:
హనుమకొండ : బండి సంజయ్ వ్యాఖ్యలపై హనుమకొండ కలెక్టరేట్ ఎదుట టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మాభిమానం దెబ్బతినేలా ఉద్యోగులపై, ఉద్యోగ సంఘాల గురించి చులకనగా మాట్లాడడం సమంజసం కాదని, వెంటనే బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సాధనలో టీఎన్జీవోస్ యూనియన్ ప్రధాన పాత్ర పోషించిందని.. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు ఉద్యోగులు వారధులన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఆయన మార్గదర్శకత్వంలో బంగారు తెలంగాణ కోసం ఉద్యోగులు పనిచేస్తున్నారని ఆయన గుర్తుచేశారు. అలాంటి ఉద్యోగులపై నోరుపారేసుకున్న బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే బండి సంజయ్ వ్యాఖ్యలను ఉద్యోగులంతా ముఖ్యకంఠంతో ఖండిస్తున్నట్లు హనుమకొండ జిల్లా టీజీవో కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు.
-ఆకుల రాజేందర్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు, హనుమకొండ
బండి సంజయ్పై పై చర్యలు తీసుకోవాలి..
మహబూబాబాద్ రూరల్ : ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని టీఎన్జీజీవోస్ జిల్లా అధ్యక్షుడు వడ్డెబోయిన శ్రీనివాస్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉద్యోగలు ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడడం ఆయనకు తగదని హెచ్చరించారు. క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని స్పష్టంచేశారు. దేశ ప్రజలను విభజించి పాలించాలని చూస్తున్న బీజేపీకి తెలంగాణ ప్రజలు మునుగోడులోనే తగిన బుద్ధి చెబుతారని హితవు పలికారు. బండి వ్యాఖ్యలపై టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ రోడ్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఉద్యోగులపై నోరుపారేసుకున్న సంజయ్పై వెంటనే చర్యలు తీసుకోవాలని టీఎన్జీవోస్ నాయకుడు రోహిత్ నాగబ్రహ్మచారి సహా పలువురు డిమాండ్ చేశారు.
– వడ్డెబోయిన శ్రీనివాస్, టీఎన్జీజీవోస్ జిల్లా అధ్యక్షుడు, మహబూబాబాద్
క్షమాపణ చెప్పాల్సిందే..
జనగామ రూరల్ : బండి సంజయ్ వెంటనే ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఖాజా షరీఫ్ డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాలపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జనగామ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. మారోసారి ఇలా మాట్లాడితేనే ఉరుకోబోమని హెచ్చరించారు. ఇక్కడ జిల్లా కార్యదర్శి పెండాల శ్రీనివాస్, కోశాధికారి తలారి మల్లేశం, ఉపాధ్యక్షులు రాజనర్సయ్య, ఎండీ.హఫీజ్, రాంనర్సయ్య, సంపత్ పాల్గొన్నారు.
– ఖాజా షరీఫ్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు, జనగామ
నీతిమాలిన మాటలు మానుకో
కృష్ణకాలనీ : ఉద్యోగ సంఘాలు అమ్ముడు పోయాయని నీతిమాలిన మాటలు మాట్లాడిన బండి సంజయ్ వెంటనే రాష్ట్రంలోని ఉద్యోగులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని టీఎన్జీవోస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు బూరుగు రవి డిమాండ్ చేశారు. జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిరసన తెలిపారు. ఇక్కడ రవి మాట్లాడుతూ ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడడం సంజయ్కు తగదన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జీతాలు, జీవితాలు పణంగా పెట్టిన చరిత్ర ఉద్యోగులదని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలపై, ప్రత్యేకంగా టీఎన్జీఓఎస్ యూనియన్పై నోరుపారేసుకున్న బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేకపోతే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇక్కడ టీఎన్జీవోస్ జిల్లా కోశాధికారి దశరథ రామారావు, ఉద్యోగ జేఏసీ భాగస్వామ్య పక్షాల నాయకులు, తహసీల్దార్ ఎండీ ఇక్బాల్, జేఏసీ నాయకులు టీ సత్యనారాయణ, వంశీకృష్ణ, మహేందర్, సురేశ్, భాస్కర్, శ్రావణ్, సతీశ్, శివ, ప్రవీణ్, వీఆర్ఏలు రమేశ్, రాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
– బూరుగు రవి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు, భూపాలపల్లి
అవమానించడం తగదు
ములుగు రూరల్ : ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతినేలా పదే పదే అవమానించడం బండి సంజయ్కి తగదని టీఎన్జీవోఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు ఠాకూర్ జ్ఞానేశ్వర్సింగ్ మండిపడ్డారు. ములుగు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలపై నోరు పారేసుకున్న సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమకు ఎవరు ఎక్కువ, తక్కువ కాదని, ఎవరు మేలు చేస్తే వారి వెంట ఉంటామన్న విషయాన్ని తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పోలురాజు, అసోసియేట్ అధ్యక్షుడు రాజేశ్వర్రావు, కోశాధికారి భూక్యాలాల్, ఉపాధ్యక్షుడు కుమారస్వామి, మహేందర్, సహాయ కార్యదర్శులు శ్రీధర్, రఘు, శ్రీనివాస్, రామునాయక్, కృష్ణ, దుర్గారావు, సాంబయ్య, భాస్కర్, మహిళా ఉద్యోగులు చైతన్య, మేఘన పాల్గొన్నారు. అలాగే జడ్పీ కార్యాలయం వద్ద ప్లకార్డులతో నాల్గో తరగతి ఉద్యోగులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం కార్యదర్శి ఎండీ కిర్మనీ, కోశాధికారి నాగరాజు, ఉద్యోగులు శశిధర్, సంతోష్, రవిత, సాంబయ్య, స్వరాజ్యం పాల్గొన్నారు.
– ఠాకూర్ జ్ఞానేశ్వర్సింగ్, టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షుడు, ములుగు
ఐటీడీఏలో ఉద్యోగుల నిరసన
ఏటూరునాగారం : బండి సంజయ్పై ఐటీడీఏ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజీవో ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వెంటే క్షమాపణ చెప్పాలని ఐటీడీఏ కార్యాలయం ఆవరణలోని కొమురంభీం విగ్రహం వద్ద బండి సంజయ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీజీవో జిల్లా సెక్రటరీ దామోదర్స్వామి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజ్కుమార్, టీఎన్జీవో కోశాధికారి బి. లాల్, ఐటీడీఏ మేనేజర్ శ్రీనువాస్, నర్సింగ్, ఏవో కిరణ్, పెసా జిల్లా కోఆర్డినేటర్ ప్రభాకర్, ఏసీఎంవో వ్యాగ్యానాయక్, ఐటీడీఏ ఉద్యోగ సంఘాల నాయకులు వెంకన్న, హైజాక్, ప్రభాకర్, గౌస్, సతీశ్, సమ్మయ్య, రాంప్రసాద్ పాల్గొన్నారు.
ఎనుమాముల మార్కెట్ ఉద్యోగుల ధర్నా
కాశీబుగ్గ : బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగులు సోమవారం మార్కెట్ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సంఘం అధ్యక్షుడు జన్ను భాస్కర్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. టీఎన్జీవోస్ యూనియన్పై నోరు పారేసుకున్న సంజయ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని భాస్కర్ డిమాండ్ చేశారు. ఇక్కడ మార్కెట్ కార్యదర్శి బరుపాటి వెంకటేశ్ రాహుల్, గ్రేడ్-2 కార్యదర్శి తోట చందర్రావు, బియాబాని, సంగినేని శ్రీనివాస్, లాషరీశ్, భూక్య నరసింహానాయక్, కృష్ణమీనన్, వెంకన్ననాయక్, ముడిదే శివ, సాగర్, వివేక్, కనుకుంట్ల వినయ్కాంత్, యాకయ్య, డీఈవో చారి, పాల్గొన్నారు.
ఉద్యోగులను విమర్శించే హక్కు ‘బండి’కి లేదు..
– టీఎన్జీవోస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గజ్జెల రామ్కిషన్
వరంగల్ : బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని వరంగల్ జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షుడు గజ్జెల రామ్కిషన్ డిమాండ్ చేశారు. సోమవారం ఎంజీఎం సెంటర్లో ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ టీఎన్జీవోస్ నాయకులు ఏనాడూ జీతాల కోసం పనిచేయలేదన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమంలో పాల్గొన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఏనాడూ ఉద్యమంలో పాల్గొనని సంజయ్కి ఉద్యోగ సంఘాలను విమర్శించే నైతిక హక్కు లేదని విమర్శించారు. క్షమాపణ చెప్పకపోతే విధులు బహిష్కరించి నిరసన తెలుపుతామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి గాదె వేణుగోపాల్, కోశాధికారి పాలకుర్తి సదానందం, నాయకులు హేమానాయక్, మురళీధర్రెడ్డి, వేముల వెంకటేశ్వర్లు, రాజు, యాకమ్మ, చందర్రావు, రవీందర్, జ్యోతి, సునీతా నాయర్, ఎంజీఎం యూనిట్ నాయకులు రమేశ్, రామకృష్ణ, మెడికల్ ఫోరం నాయకులు మాడిశెట్టి శ్రీనివాస్, రజనీకాంత్, విద్యా శాఖ ఫోరం నాయకులు శ్రీనివాస్, మార్కెట్ యూనిట్ నాయకులు జన్ను భాస్కర్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు శెంకేశి రాజేశ్, బుచ్చయ్య, కుమారస్వామి, సుదర్శన్, సుకన్య, శ్రీకళ, అర్చన, సత్యనారాయణ, అశోక్ పాల్గొన్నారు.