నల్లబెల్లి, అక్టోబర్ 22: బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మందులతో కూడిన కిట్లను పంపిణీ చేస్తున్నది. పైసా ఖర్చు లేకుండా మందులు అందజేస్తుండడంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం మండలంలోని మూడుచెక్కలపల్లెలో డాక్టర్లు శనివారం వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యులు బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు చేసి మందుల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సపావట్ దేవూనాయక్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా గ్రామస్తులు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అందజేస్తున్న ఈ మందులు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది మణెమ్మ, కవిత, అంగన్వాడీ కార్యకర్తలు సరిత, విజయ పాల్గొన్నారు.
బీపీ, షుగర్ మందుల కిట్ల పంపిణీ
పోచమ్మమైదాన్: వరంగల్ దేశాయిపేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఉచిత బీపీ, షుగర్ మందుల కిట్లను కార్పొరేటర్ కావటి కవితా రాజుయాదవ్ బాధితులకు పంపిణీ చేశారు. మెడికల్ ఆఫీసర్ తంగళ్లపల్లి భరత్కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ బీపీ, షుగర్ ఉన్న వారికి నయా పైసా ఖర్చు లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం మందులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కిట్లను వైద్యుల సూచన మేరకు వాడాలని కోరారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సూపర్వైజర్ జన్ను కొర్నేలు, స్టాఫ్నర్సు సరస్వతి, ఎంఎన్వో కాలువల కుమార్ పాల్గొన్నారు.