గిర్మాజీపేట, అక్టోబర్ 11: లింగ వివక్షను రూపుమాపాలని డీఎంహెచ్వో కే వెంకటరమణ అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలు అంటే టెన్షన్ కాదని, వారు టెన్ సన్స్తో సమానమని అన్నారు. డిప్యూటీ డీఎంహెచ్వో అనిల్కుమార్ మాట్లాడుతూ అవనిని రక్షిద్దాం, ఆడపిల్లను రక్షిద్దాం, ఆరోగ్యంగా ఉందాం.. అవని ఆడపిల్ల అభివృద్ధి ధ్యేయంగా ఆలోచిస్తే సమాజమంతా సంతోషంగా ఉంటుందని తెలిపారు. పీవోడీటీటీ భూపేశ్, డీడీఎం నితిన్రెడ్డి, ఎల్ఈడీ స్క్రీన్ ఆపరేటర్ నాగరాజు పాల్గొన్నారు.
నర్సంపేట: నర్సంపేటలోని విజ్డమ్ హైస్కూల్లో స్వయంకృషి సోషల్ వర్క్స్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో ఎఫ్ఎంఎం సోషల్ సర్వీస్ సొసైటీ సహకారంతో బాలికలకు అవగాహన సదస్సు నర్సంపేట సీఐ పులి రమేశ్ మాట్లాడుతూ బాలికలు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. భ్రూణహత్యలు చేయొద్దన్నారు. ఆడపిల్లలు సెల్ఫోన్, ఫేస్బుక్, ఇంటర్నెట్కు దూరంగా ఉండాలని సూచించారు. విజ్డమ్ పాఠశాల డైరెక్టర్ జావిద్, స్వయంకృషి సంస్థ నిర్వాహకులు బెజ్జంకి ప్రభాకర్, వనప్రేమి అవార్డు గ్రహీత రామస్వామి, కరస్పాండెంట్ జహంగీర్, ప్రిన్సిపాల్ రహీమొద్దీన్, వీరభద్రం, రియాజ్ పాల్గొన్నారు. కాగా, నర్సంపేట బాలికల ఉన్నత పాఠశాలలో ఛాయ సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. మాతృభూమి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఏ.మోహన్రావు మాట్లాడారు. సొసైటీ కార్యదర్శి కోట డేవిడ్, హెచ్ఎం రూపారాణి, కృష్ణ, అనిల్, శౌరీ అసంతీన, కందుల స్వామి, రఘుపతి, సురేశ్, అరుణ, వాణి, స్వప్న, విజయలక్ష్మి, రాధిక, సుకన్య, భాస్కర్ పాల్గొన్నారు. నర్సంపేట మాంటిస్సోరి పాఠశాలలో నిర్వహించిన బాలికల దినోత్సవం సదస్సులో హెచ్ఎం ఎర్ర జగన్మోహన్రెడ్డి మాట్లాడారు. డైరెక్టర్ ఎర్ర ఊర్మిళ పాల్గొన్నారు.
గీసుగొండ: మండలంలోని మరియపురంలో మంగళవారం సర్పంచ్ అల్లం బాలిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సెయింట్జాన్స్ పాఠశాలలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. బాలికలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు బాలికలను ఉన్నత చదువులను చదివించాలని సూచించారు. వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్: అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా సేవా స్వచ్ఛంద సంస్థ, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో దేశాయిపేటలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం సమావేశం నిర్వహించారు. సేవా స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి అయిత ఉషాభాస్కర్ మాట్లాడుతూ బాలికలు బాల్యం నుంచే కష్టపడి చదువుతూ ఉత్తమ విద్యావేత్తలు కావాలన్నారు. ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ రాష్ట్ర కన్వీనర్ పాలడుగుల సురేందర్ మాట్లాడారు. అనంతరం బాలికల విద్యపై పోస్టర్లను ఆవిష్కరించారు. పాఠశాల హెడ్మాస్టర్ అహల్య, సంస్థ వ్యవస్థాపకుడు జూపాక రత్న ప్రణయ్, ఉపాధ్యక్షుడు గండి ఆనందం, సభ్యులు సందీప్, ప్రదీప్, బాబురాజ్ పాల్గొన్నారు.
నల్లబెల్లి: మండల కేంద్రంలోని కేజీబీవీలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఎంపీపీ ఊడుగుల సునీత కేక్ కట్ చేసి విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఎంపీడీవో విజయ్కుమార్, టీఆర్ఎస్ మండల ఊడుగుల ప్రవీణ్, ఎంపీవో కూచన ప్రకాశ్, కేజీబీవీ ప్రత్యేక అధికారి సునీత పాల్గొన్నారు.