నర్సంపేట, ఆగస్టు 25: గౌడ కులస్తుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని పాకాల రోడ్డు సెంటర్లో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని గురువారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. అనంతరం పెద్ది మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గీత కార్మికుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. గీత వృత్తిపై ఆధారపడిన వారికి పింఛన్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. నర్సంపేట నియోజకవర్గంలోని 72 సంఘాలకు చెందిన గీత కార్మికులు విగ్రహావిష్కరణకు తరలిరావడం ఆనందంగా ఉందన్నారు. నియోజకవర్గంలో గౌడ కులస్తుల కోసం ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 50 లక్షలు కేటాయించామన్నారు. అయితే, కోర్టు స్టే ఇవ్వడం వల్ల నిలిచిపోయిందని తెలిపారు. ఇప్పుడు నిర్మాణ వ్యయం పెరిగినందున రూ. కోటి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
పాపన్న జయంతిని వచ్చే ఏడాది గౌడ ఫంక్షన్ హాల్లోనే జరిపేలా పనులు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో పవన్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, ఏసీపీ సంపత్రావు, ఏఐసీసీ ఓబీసీ చైర్మన్ నాయకుడు డాక్టర్ కత్తి వెంకటస్వామి, నల్లా మనోహర్రెడ్డి, నిర్వహణ కమిటీ అధ్యక్షుడు సోల్తి సారయ్యగౌడ్, సీఐలు పులి రమేశ్గౌడ్, సూర్యప్రసాద్, ఎక్సైజ్ సీఐ రాజసమ్మయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటస్వామి, మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణగౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు గిరగాని సాంబయ్యగౌడ్, కార్యదర్శి తాళ్లపెల్లి కుమారస్వామిగౌడ్, అనంతుల రమేశ్గౌడ్, రడం శ్రీనివాస్గౌడ్, గొడిశాల మమతా సదానందంగౌడ్, కందుల శ్రీనివాస్గౌడ్, ఊడుగుల శ్రీనివాస్, పంజాల సుదర్శన్, రామగోని సుధాకర్, గంప రాజేశ్వర్, మాచర్ల ఐలుమల్లు, కొయ్యడి కొమురయ్య, కోల వెంకటేశ్వర్లు, సట్ల సతీశ్, నల్లబెల్లి ఎంపీపీ ఊడుగుల సునీతాప్రవీణ్, ఖానాపురం జడ్పీటీసీ బత్తిని స్వప్న-శ్రీనివాస్, కౌన్సిలర్లు శీలం రాంబాబు, గంప సునీత పాల్గొన్నారు.