ఐనవోలు, జూన్ 16 : పేదలకు సీఎం సహాయనిధి అండగా ఉంటుందని టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట శాసన సభ్యుడు అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని నందనం గ్రామానికి యాకర రమేశ్ కొంతకాలంగా పేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. రమేశ్ పరిస్థితిని గ్రామస్తులు ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే అరూరి రమేశ్ వెంటనే స్పందించారు. బాధితుడిని తన సొంత ఖర్చులతో నిమ్స్లో చేర్పించారు. అంతేకాకుండా వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.2.50 లక్షల ఎల్వోసీని గురువారం కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యుడు మునిగాల సంపత్కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు పోలెపల్లి శంకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి బుర్ర రాజశేఖర్, నియోజకవర్గ అధికారి ప్రతినిధి మిద్దెపాక రవీందర్, మండల యూత్ అధ్యక్షుడు మరుపట్ల నరేశ్, సర్పంచ్ యాకర మంజుల, ఉప సర్పంచ్ ఆరెల్లి మౌనిక, నాయకులు యాదగిరి, రామ్, లవణ్కుమార్, దేవదాసు, మండల సత్యం, బక్కులు, శివాజీ, స్వామి, శ్రీనాథ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.