వేలేరు, జూన్ 9 : కార్పొరేట్కు దీటు గా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మన ఊరు- మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య అన్నారు. గురువారం మన ఊరు-మనబడి, పల్లెప్రగతి కార్యక్రమాల్లో భాగంగా మండలంలోని కమ్మరిపేట, పీచర గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కమ్మరిపేట పాఠశాలలో సుమారు రూ.8.03లక్షలతో, పీచరలోని పాఠశాలలో రూ.8.32లక్షలతో తాగునీరు, ఎలక్ట్రికల్ వైర్స్, అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలా గే, పీచర గ్రామంలో పల్లెప్రగతిలో భా గంగా సుమారు రూ.4లక్షలతో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ య్య మాట్లాడుతూ విద్యార్థుల్లో మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయనే ఆలోచనతో సీఎం కేసీఆర్ ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చాడ సరితారెడ్డి, వైస్ ఎంపీపీ సంపత్, కుడా డైరెక్టర్ ఆకుల కుమార్, ఆత్మ జిల్లా చైర్మ న్ కీర్తి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మారిజే నర్సింహారావు, కోఆప్షన్ సభ్యుడు జానీ, సర్పంచ్లు మ్యాక రవీందర్, జోడుముంతల రమేశ్, కొట్టె రాజేశ్, ఎంపీటీసీ సంపత్, మల్లన్న ఆలయ చైర్మన్ రవియాదవ్, తహసీల్దార్ సమ్మయ్య, ఎంపీడీవో రవీందర్, ఏపీవో విజయ, ఎస్ఎంసీ చైర్మన్ మధు, ఉపసర్పంచ్ సరస్వతి, పంచాయతీ కార్యదర్శులు రూప, రాజిరెడ్డి, హెచ్ఎం ఎల్లయ్య యాదవ్ పాల్గొన్నారు.