కరీమాబాద్, మే 16: కలిసికట్టుగా డెంగీని నివారిద్దామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వెంకటరమణ అన్నారు. జాతీయ డెంగీ నివారణ దినాన్ని పురస్కరించుకుని సోమవారం కరీమాబాద్లో వ్యాధిపై అవగాహన కల్పించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వెంకటరమణ మాట్లాడుతూ డెంగీపై అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాధి నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యాధి రాకుండా నివారణ చర్యలను చేపట్టాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలన్నారు. నివాస ప్రాంతంలో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలన్నారు. చెత్తా చెదారం లేకుండా ఉంచుకోవాలన్నారు. అనంతరం నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లం పద్మ, మరుపల్ల రవి, నాయకులు పల్లం రవి, ఎస్ఆర్ఆర్తోట యూపీహెచ్సీ డాక్టర్ అరుణ్, రంగశాయిపేట యూపీహెచ్సీ డాక్టర్ నాగరాజు, సీవో మోహన్రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డెంగీని తరిమికొట్టాలి
పోచమ్మమైదాన్: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ డెంగీని తరిమికొట్టాలని దేశాయిపేట అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ భరత్కుమార్, డాక్టర్ రవీందర్ అన్నారు. దేశాయిపేటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. దోమకాటుతో ఈ వ్యాధి వస్తుందని అన్నారు. త్రీవమైన వేడితో కూడిన జ్వరం, భరించలేని తలనొప్పి, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపించగానే వైద్యుల సలహా ప్రకారం పరీక్షలు చేయించుకుని, మందులు వాడాలని వారు సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ జన్ను కొర్నేలు, స్టాఫ్నర్సులు సరస్వతీ, జ్యోతి, ఎఎన్ఎంలు అశ్విని, నిహారిక, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
పరిశుభ్రత పాటించాలి
గీసుగొండ: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సర్పంచ్ కేదాసి అనిల్ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. బొడ్డుచింతలపల్లి గ్రామంలో వైద్యారోగ్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. గీసుగొండలో వైద్యాధికారి మాధవీలత మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీహెచ్వో మధుసూదన్రెడ్డి, కిరణ్కుమార్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
డెంగీ నివారణకు కృషి చేయాలి
నర్సంపేట రూరల్: డెంగీ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భాంజీపేట పీహెచ్సీ వైద్యాధికారి భూపేశ్ అన్నారు. భాంజీపేట పీహెచ్సీ ఆధ్వర్యంలో పీహెచ్సీ వైద్యాధికారి సమక్ష్యంలో వైద్య సిబ్బంది గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
ప్రాణాలను కాపాడుకుందాం
నల్లబెల్లి: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని విలువైన ప్రాణాలను కాపాడుకుందామని మేడెపల్లి పీహెచ్సీ వైద్యాధికారి శశికుమార్ అన్నారు. మేడెపల్లి ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు నగేశ్, దామోదర్రెడ్డి, వైద్య సిబ్బంది పద్మ, శిరీష, వీరేందర్, రవి, రేణుక, సుమలత, అనురాద, దివ్వ, అనిల్, ఆశ వర్కర్లు రజిత, అరుణ, అనిత, ప్రేమలత, శ్రీలత, జయ పాల్గొన్నారు.
ఇల్లందలో అవగాహన ర్యాలీ
వర్ధన్నపేట: ఇల్లంద గ్రామంలో వైద్యారోగ్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తల నేతృత్వంలో డెంగీ నివారణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు సరోజ, రమాదేవి, అపరంజి, ఆశ కార్యకర్తలు సువర్ణ, అన్నపూర్ణ, రాధిక, కోమల, శోభ పాల్గొన్నారు.