నర్సంపేట, మే 16 : పేదింటి ఆడబిడ్డల పెళ్లికి సీఎం కేసీఆర్ సాయం చేస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 156 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.లక్షా నూటపదహార్లు అందిస్తున్నారని తెలిపారు. ఈ పథకాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తున్నారని తెలిపారు. నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, ఎంపీపీ మోతె కళావతి, ఆర్డీవో పవన్కుమార్, తహసీల్దార్ రామ్మూర్తి, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
పేదింటి ఆడబిడ్డలకు వరం..
నల్లబెల్లి : పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు వరమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో 73 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఆర్డీవో పవన్కుమార్, తహసీల్దార్ దూలం మంజుల, ఎంపీడీవో విజయ్కుమార్, ఎంపీపీ ఊడుగుల సునీతాప్రవీణ్, వైస్ ఎంపీపీ గందె శ్రీలతాశ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, ఆర్ఐ రాజేంద్రప్రసాద్, సర్పంచ్ నానెబోయిన రాజారాం, ఎంపీటీసీ జన్ను జయరావు, అధికారులు, లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మహిళా సంక్షేమమే ధ్యేయం
నెక్కొండ : మహిళా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పలు పథకాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నెక్కొండ మండలానికి చెందిన 144 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. ఎంపీపీ జాటోత్ రమేశ్, జడ్పీటీసీ లావుడ్య సరోజనాహరికిషన్, డిప్యూటీ తహసీల్దార్ రాజ్కుమార్, నెక్కొండ, సూరిపల్లి సొసైటీ చైర్మన్లు మారం రాము, ఘంటా దామోదర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, జిల్లా నాయకులు చల్లా చెన్నకేశవరెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొణిజేటి భిక్షపతి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కర్పూరపు శ్రీనివాస్, మండల నాయకులు సూరం రాజిరెడ్డి, గుంటుక సోమయ్య, దేవనబోయిన వీరభద్రయ్య, బర్ల వీరభద్రయ్య, బొడ్డుపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.
104 మందికి చెక్కుల పంపిణీ
చెన్నారావుపేట : మండలంలోని పలు గ్రామాలకు చెందిన 104 మందికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2002 ఉద్యమ సమయంలో నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లి గ్రామంలో కల్పన అనే బంజార ఆడబిడ్డ వివాహ సమయంలో అక్కడే ఉన్న కేసీఆర్ ఇలాంటి పథకం తేవాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఒక్క రోజే రూ.7 కోట్ల విలువైన చెక్కులు అందజేసినందుకు సంతోషంగా ఉందని చెప్పారు .కల్యాణలక్ష్మి చెక్కులు లబ్ధిదారులకు త్వరగా వచ్చేలా కృషి చేసిన తహసీల్దార్ భన్సీలాల్ను అభినందించారు. జడ్పీటీసీ పత్తినాయక్, ఎంపీపీ బానోత్ విజేందర్, టీఆర్ఎస్ మండల ఆధ్యక్షుడు బాల్నె వెంకన్న, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు బుర్రి తిరుపతి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, వైస్ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి, చెన్నారావుపేట సర్పంచ్ కుండె మల్లయ్య, మాజీ జడ్పీటీసీ జున్నూతుల రాంరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దుగ్గొండిలో 72 మందికి..
దుగ్గొండి : మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో 72 మందికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఆర్డీవో పవన్కుమార్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, ఎంపీడీవో కృష్ణ ప్రసాద్, తహసీల్దార్ సంపత్కుమార్, సర్పంచ్లు మంజులానర్సింహారెడ్డి, విద్యాసాగర్గౌడ్, ఊర్మిలావెంకన్న, శోభా కమలాకర్ పాల్గొన్నారు.
అభివృద్ధికి అప్పులు చేస్తే తప్పేంటి?
ఖానాపురం : అభివృద్ధి పనులకు అప్పులు చేస్తే తప్పేంటని నర్సంపేట ఎమ్మేల్యే పెద్ది సుదర్శన్రెడ్డి బీజేపీ నాయకులను ప్రశ్నించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో 79 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. నర్సంపేట నియోజకవర్గంలోనే రూ.600 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, ఆర్డీవో పవన్కుమార్, తహసీల్దార్ జూలూరి సుభాషిణి, వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి, ఉపేందర్రెడ్డి, సర్పంచ్ చిరంజీవి, కాస ప్రవీణ్కుమార్, లబ్ధిదారులు పాల్గొన్నారు.
పార్టీలకతీతంగా నియోజకవర్గ అభివృద్ధి
టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు సముచిత స్థానం లభిస్తుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని కమ్మపల్లి గ్రామానికి చెందిన మూడు కుటుంబాలు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సమక్షంలో గౌడ సంఘం పెద్ద తడుక అంజయ్య, తడుక రాంబాబు, తడుక ప్రసాద్తో పాటు మరో 10మంది టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, శివారు పల్లెలు, తండాలను పార్టీలకతీతంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ వల్గుబెల్లి రంగారెడ్డి, గ్రామ అధ్యక్షుడు మిట్టగడపల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి చిలువేరు శ్రీనివాస్, కోశాధికారి దామోర రాజ్కుమార్, మోతె పద్మనాభరెడ్డి, ఉప సర్పంచ్ తిరుపతి, పెండ్యాల మునేందర్, పెండ్యాల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.