గ్రేటర్ ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట
జనరల్ స్థానాల్లోనూ టికెట్లు కేటాయింపు
అన్ని కులాలవారికి ప్రాధాన్యం
రూ.2,579 కోట్లతో నగరాభివృద్ధి
ఎప్పటికైనా మన ఇంటి పార్టీ టీఆర్ఎస్సే
బీజేపీ తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు
కేంద్ర ప్రభుత్వం వరంగల్కు చేసిందేమీలేదు
తెలంగాణపై వివక్ష చూపుతున్నది
అవసరం మేరకు టీకాలు ఇవ్వడం లేదు
ఆక్సిజన్ కొరతతో ఎవరైనా మరణిస్తే
హన్మకొండ, ఏప్రిల్ 23 : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అన్ని కులాలకు ప్రాధాన్యం ఇచ్చిందని, బీసీలు, మహిళలకు పెద్దపీట వేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. శుక్రవారం ఆయన హన్మకొండ రాంనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. రిజర్వేషన్ల ప్రకారం కేటాయించిన సీట్లు ఇవ్వడంతోపాటు అదనంగా జనరల్ స్థానాల్లో బీసీలు, ఎస్సీ మహిళలకు 19 స్థానాల్లో అవకాశం ఇచ్చామన్నారు. మొత్తం 66 డివిజన్లలో 11 మంది బీసీలు, ఏడుగురు బీసీ మహిళలు, ఒక ఎస్సీ మహిళను జనరల్ స్థానాల్లో బరిలో నిలిపినట్లు తెలిపారు. జనరల్ పురుషుల స్థానాలుగా ఉన్న 4వ డివిజన్లో యాదవులకు, 5వ డివిజన్లో ఉప్పర, 7వ డివిజన్లో పద్మశాలి, 31వ డివిజన్లో మున్నూరుకాపు, 61వ డివిజన్లో నాయీబ్రాహ్మణ, 45వ డివిజన్లో ముదిరాజ్, 56వ డివిజన్లో మున్నూరుకాపు, 66వ డివిజన్లో వారాల, 27, 35వ డివిజన్లలో మున్నూరుకాపులకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు.
అదేవిధంగా జనరల్ మహిళల స్థానంలో 58వ డివిజన్లో మాదిగ, 63వ డివిజన్లో ముదిరాజ్, 55వ డివిజన్లో యాదవ, 24వ డివిజన్లో మున్నూరుకాపు, 50వ డివిజన్లో ఉప్పర, 59,16వ డివిజన్లలో మున్నూరు కాపులకు టికెట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పుడున్న సో కాల్డ్ పార్టీలకు భిన్నంగా టీఆర్ఎస్ పార్టీ బడుగుల పక్షపాతిగా ఉందన్నారు. బీసీలకు రిజర్వేషన్ల ప్రకారం దక్కాల్సినవాటితోపాటు అదనంగా 18 డివిజన్లలో, ఒక డివిజన్లో ఎస్సీ మహిళకు అవకాశం ఇచ్చిన ఘనత టీఆర్ఎస్కే దక్కిందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం పార్టీ అభ్యర్థులను ఖరారు చేశామని, అభ్యర్థులందరినీ గెలిపించాలని మంత్రి వరంగల్ ప్రజలకు పిలుపునిచ్చారు.
రూ.2,579 కోట్లతో అభివృద్ధి పనులు
వరంగల్ నగరంలో రూ.2,579 కోట్లతో పలు అభివృద్ధి పను లు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. నగర ప్రజలకు తాగునీరు కోసం రూ.1500కోట్లు, డబుల్ బెడ్రూం ఇండ్లకు రూ.87.78లక్షలు కేటాయించామన్నారు. రూ.39.87కోట్ల వ్యయంతో వరంగల్లో మూడు, హన్మకొండలో మూడు సమీకృత మార్కెట్లు ఒక్కొక్కటి మూడు ఎకరాల్లో నిర్మిస్తున్నట్లు చెప్పారు. మైనార్టీల సంక్షేమానికి రూ.5.70కోట్లు, రైల్వే బ్రిడ్జిల నిర్మాణానికి రూ.67.80కో ట్లు, జం క్షన్ల సుందరీకరణకు రూ.1.93కోట్లు, డ్రైనేజీల కోసం రూ.179.50కోట్లు, రోడ్ల నిర్మాణానికి రూ. 487.3కోట్లు, వైకుంఠధామాలు, పార్కుల నిర్మాణానికి రూ.39.87కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు.అలాగే నగరంలోని 479మంది నిరుపేదలకు ఇండ్ల పట్టాలు అందజేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం వరంగల్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కరోనాతో ఆదాయం పడిపోయినప్పటికీ ఎలాంటి సహకారం చేయడం లేదన్నారు.
వరదలు వచ్చినప్పుడు నగర ప్రజలు అన్ని విధాలా ఆదుకున్నదని తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసి చూపించారని అన్నారు. ఎప్పటికైనా మన ఇంటి పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ఇంటింటికీ తిరిగే పరిస్థితి లేదని, నగరంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని చూసి పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతుందని, కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇంజక్షన్లు, ఆక్సిజన్, వ్యాక్సిన్లు అవసరం మేరకు పంపడం లేదన్నారు. ఆక్సిజన్ కొరతతో ఎవరైనా మరణిస్తే అందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ర్టానికి తీరని అన్యాయం చేస్తున్నదని, వరంగల్ ప్రజలు గ్రేటర్ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్భాస్కర్ పాల్గొన్నారు.
బీజేపీవి మోసపూరిత రాజకీయాలు
బీజేపీ మోసపూరిత రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం కల్పించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం ఆయన హన్మకొండ స్నేహనగర్లోని ఎస్వీ కన్వెన్షన్హాల్లో చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పార్టీ టికెట్లు ఆశించి భంగపడిన వారికి భవిష్యత్లో సీఎం కేసీఆర్ సము చిత స్థానం కల్పిస్తారని చెప్పారు. కరోనా వేళ కార్యకర్తలు నిబంధనలు పాటిస్తూ ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించాలన్నారు.