వ్యాక్సినేషన్కు పకడ్బందీ ప్రణాళిక
తొలుత హైదరాబాద్లోని స్టేట్ సెంటర్కు
ఆ తర్వాత జిల్లాల్లోని నిల్వల కేంద్రాలకువ్యాక్సిన్
మూడోదశల్లో క్షేత్రస్థాయి సెంటర్లకుసరఫరా
రవాణా, నిల్వలు, పంపిణీలో అధికారుల సమన్వయం
సిబ్బంది నిర్విరామ సేవలపై ప్రశంసల వర్షం
వరంగల్రూరల్, ఏప్రిల్ 22 (నమస్తేతెలంగాణ):కరోనా వ్యాక్సినేషన్ను విజయవంతంగా నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పకడ్బందీ ప్రణాళిక రూపొందించి ఆచరణలో పెడుతున్నారు. టీకా నాణ్యతా ప్రమాణాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా రు. వ్యాక్సిన్ రవాణా నుంచి మొదలుకుని నిల్వ, పంపిణీ వరకు అడుగడుగునా కోల్డ్ చైన్ మేజేన్మెంటు విధానాన్ని అమలు చేస్తున్నారు. వైద్యులు, సిబ్బంది విశేష సేవలతో ప్రశంసలు పొందుతున్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. దీని సక్సెస్ బాధ్యతను వైద్య ఆరోగ్యశాఖ తమ భుజాన వేసుకుంది. టీకా తయారీ నుంచి పంపిణీ వరకు ఉష్ణోగ్రత నిల్వల్లో తేడా రాకుండా పక్కా ప్లాన్ రచించింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి వ్యాక్సిన్ నిల్వలు తొలుత హైదరాబాద్లోని స్టేట్ వ్యాక్సిన్ సెంటర్కు చేరుకుంటున్నాయి. ఇక్కడి నుంచి ఆయా డీఎంహెచ్వో కార్యాలయంలోని వ్యాక్సిన్ నిల్వల కేంద్రానికి తరలిస్తున్నారు. తిరిగి ఇక్కడి నుంచి జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ఆయా జిల్లాల్లోని వ్యాక్సినేషన్ సెంటర్లకు తరలిస్తున్నారు. ఉదాహరణకు వరంగల్రూరల్ జిల్లాలో మూడు రూట్లను గుర్తించారు. వీటిలో ఒకటి పరకాల, రెండోది నర్సంపేట, మూడు వర్ధన్నపేట. ఈ మూడు రూట్ల ద్వారా జిల్లాలో ఉన్న 20 వ్యాక్సినేషన్ సెంటర్లకు ఎప్పటికప్పుడు టీకాను ప్రత్యేక వాహనం ద్వారా చేర్చుతున్నారు. టీకా రవాణాలో డీఎంహెచ్వో, ఇమ్యునైజేషన్ అధికారి, జిల్లా ఇన్చార్జి ఫార్మసిస్టు బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక వాహనాలతో పాటు డీ ఫ్రీజర్లు, ఐఎల్ఆర్లు, కోల్డ్ బాక్సులు వినియోగిస్తున్నారు.
సేవలు ప్రశంసనీయం
వ్యాక్సినేషన్లో వైద్యులు, సిబ్బంది సేవలను ప్రజలు ప్రశంసిస్తున్నారు. ప్రతి టీకా కేంద్రంలో ఐదుగురు వ్యాక్సినేటర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరితో పాటు ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో), ఇద్దరు లేదా ముగ్గురు సూపర్వైజర్లు పనిచేస్తున్నారు. వైద్యాధికారి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. సీహెచ్సీ సూపరింటెండెంట్, మెడికల్ ఆఫీసర్ నేతృత్వంలో మొత్తం టీం పనిచేస్తుంది.
పక్కాగా లెక్క
జిల్లాలోని ఆయా సీహెచ్సీ, పీహెచ్సీల్లోని ఫార్మసిస్టులు తమ సెంటర్కు వచ్చిన వ్యాక్సిన్ నిల్వలను ఎప్పటికప్పుడు రిజిస్టర్లో ఎంట్రీ చేస్తారు. సాయంత్రం బ్యాలెన్సు, రిక్వైర్మెంట్ వివరాలను డీఎంహెచ్వో, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారికి పంపిస్తారు. దీని ప్రకారం మరుసటి రోజు ఆయా టీకా కేంద్రానికి వ్యాక్సిన్ నిల్వలు చేరుతాయి.
టీకా కోసం బారులు
కరోనా వ్యాక్సినేషన్పై తొలుత ప్రజల్లో తలెత్తిన అపోహలు క్రమేణా తొలిగిపోతున్నాయి. అవగాహన ఏర్పడడం తో వ్యాక్సిన్ వేసుకునేందుకు జనం స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. టీకా వేసుకోవటానికి సీహెచ్సీ, పీహెచ్సీలో బారులు తీరుతున్నారు. మొదట్లో 10 నుంచి 20 మంది మాత్రమే వ్యాక్సిన్ వేసుకున్నారు. ప్రస్తుతం 100 నుంచి 150 మంది వేసుకుంటున్నారు. అయినా, ఎక్కడా వ్యాక్సి న్ కొరత లేదని డీఎంహెచ్వో మధుసూదన్ తెలిపారు.