గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 612.29 కోట్లతో బడ్జెట్ను రూ పొందించగా, కౌన్సిల్ ఆమోదించింది. బుధవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, కమిషనర్ ప్రావీణ్య హాజరయ్యా రు. అంకెల గారడీ లేకుండా కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం వాస్తవానికి దగ్గరగా అధికారులు బడ్జెట్ను తయారుచేశారు. సొంత ఆదాయంగా రూ. 213.63 కోట్లు, గ్రాంట్ల రూపేణా రూ. 394.16 కోట్లు వస్తాయని చూపారు. రూ. 21.36 కోట్లు గ్రీన్ బడ్జెట్కు, 42 విలీన గ్రామాల అభివృద్ధికి రూ. 12.29 కోట్లు కేటాయించారు. నగరాభివృద్ధికి ఈ బడ్జెట్ దిక్సూచిలా నిలుస్తుందని మేయర్ గుండు సుధారాణి అభిప్రాయపడ్డారు.
వరంగల్,ఫిబ్రవరి 22: బల్దియా అధికారులు 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 612.29 కోట్ల తో బడ్జెట్ రూపొందించగా, సభ్యులు ఆమోదించారు. మధ్యాహ్నం 12 గంటలకు కార్పొరేషన్ కౌన్సిల్ హాల్ లో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, హనుమ కొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, కమిషనర్ ప్రావీ ణ్య హాజరయ్యారు. బల్దియా జూనియర్ అకౌంట్ అధి కారి సరిత బడ్జెట్ పద్దును చదవగా, సభ్యులు ఏకగ్రీ వంగా అమోదించారు.
సొంత ఆదాయం రూ. 213.63 కోట్లు
బల్దియా బడ్జెట్లో సొంత ఆదాయం రూ. 213. 63 కోట్లుగా చూపారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల పన్నుల ద్వారా రూ.84.60 కోట్లు, కిరాయిల ద్వారా రూ.9.77 కోట్లు, భవన నిర్మాణ అనుమతు లు, ఎల్ఆర్ఎస్, ఇతర టౌన్ ప్లానింగ్ సేవల ద్వారా రూ. 76.58 కోట్లు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, ఇతర శాని టేషన్ సేవల ద్వారా రూ. 19.31 కోట్లు, తాగునీటి పన్నులు, ఇతర ఇంజినీరింగ్ సేవల ద్వారా రూ. 23. 27 కోట్లు సొంత ఆదాయంగా వస్తాయని బడ్జెట్లో చూపారు. వేతనాలు, పీఎఫ్, ఈపీఎఫ్, కార్యాలయ నిర్వహణ, విద్యుత్ చార్జీల రూపేణా రూ. 190.65 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు.
గ్రాంట్ల రూపేణా రూ. 394.16 కోట్లు
బడ్జెట్లో గ్రాంట్ల రూపేణా రూ. 394.16 కోట్లు వస్తాయని అంచనా వేశారు. నాన్ప్లాన్ గ్రాంట్ల కింద 15వ ఆర్థిక సంఘం, పట్టణ ప్రగతి ద్వారా రూ. 285 కోట్లు, ప్లాన్ గ్రాంట్లలో ఎస్సీ, ఎస్టీ, ట్రైబల్, మైనార్టీ సబ్ ప్లాన్, స్వచ్ఛ్భారత్ మిషన్, సీఎంఏ, మైనారిటీ పథకాల ద్వారా రూ. 107.50 కోట్లు వస్తాయని అంచ నాలు వేశారు. నియోజవర్గ అభివృద్ధి నిధులు, స్పెషల్ డెవలప్మెంట్ నిధులు, ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా రూ. 1.66 కోట్లు వస్తాయని చూపారు.
విలీన గ్రామాల అభివృద్ధికి రూ.12.29 కోట్లు
మొత్తం బడ్జెట్లో జీతాలు, కరంట్ బిల్లులు, పాలన నిర్వహణ ఖర్చులు పోయిన తర్వాత మిగిలిన బడ్జెట్ లో 1/3 శాతం విలీన గ్రామాల అభివృద్ధికి రూ. 12.29 కోట్లు కేటాయించారు. దీంతో వీలీన గ్రామా లలో మౌలిక వసతులు కల్పించనున్నారు. రోడ్ల అభి వృద్ధికి రూ. 8 కోట్లు, డ్రైనేజీలు, కల్వర్టులు రూ. 2.65 కోట్లు, తాగునీటి సరఫరా రూ.1.44 కోట్లు, గ్రామా ల్లో ఇతర మౌలిక వసతుల కోసం రూ. 20 లక్షలు కేటాయించారు. దీంతో పార్కులు, ఆట స్థలాల అభి వృద్ధి కోసం రూ. 60 లక్షలు, జంతు వధశాలల కోసం రూ. 60 లక్షలు, స్ట్రీట్ వెండింగ్ జోన్స్ కోసం రూ. 20 లక్షలు, ఓపెన్ జిమ్స్ కోసం రూ. 20 లక్షలు ప్రత్యేకం గా నిధులు కేటాయించారు.
రూ. 22.98 కోట్ల మిగులు
సొంత ఆదాయంలో ఖర్చులు పోను మిగిలిన రూ. 22. 98 కోట్లు మిగులు బడ్జెట్గా చూపారు. వీటితో గ్రేటర్లోని డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టనున్నా రు. రూ. 9.83 కోట్లు రోడ్ల మరమ్మతులు, రూ. 5.60 కోట్లు కల్వర్టులు, డ్రైనేజీల కోసం కేటాయించారు. రూ. 5.20 కోట్లు తాగునీటి సరఫరా కోసం, రూ. 20 లక్ష లు వీధి దీపాలు, రూ. 1.90 కోట్లు కార్యాలయ భవన మరమ్మతులు, ఫర్నిచర్, రూ. 20 లక్షలు జంక్షన్ల అభి వృద్ధి కోసం కేటాయించారు.
రూ. 21.36 కోట్లతో గ్రీన్బడ్జెట్
కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం సొంత ఆదాయం రూ. 213.63 కోట్లలో 10 శాతం నిధులు రూ. 22.98 కోట్లు గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించారు. ఈ నిధులను తప్పనిసరిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. గ్రీన్ బడ్జెట్తో హరితహారంతో పాటు కార్పొరేషన్ పరి ధిలో నర్సరీల నిర్వహణ, పార్కులు, బ్లాక్ ప్లాంటేషన్, నగరంలో గ్రీనరీ నిర్వహణ చేయనున్నారు. దీంతో నగరంలో పచ్చదనం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నా యి. సమావేశంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీ మ్, కార్పోరేటర్లు, వింగ్ అధికారులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్యలను పరిష్కరించాలి
– నన్నపునేని నరేందర్, తూర్పు ఎమ్మెల్యే
రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకోని నగరం లో తాగునీటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి. నగర సమస్యలపై ప్రత్యే కంగా రెండు రోజుల పాటు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి సమగ్రంగా చర్చించాలి. ఇటీవల మంత్రి కేటీ ఆర్ హైదరాబాద్లో నిర్వహించిన సమీక్షా సమా వేశంలో నగర తాగునీటి సమస్యలపై చేసిన మా ర్గదర్శనం ప్రకారం సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి.
నగరాభివృద్ధికి దిక్సూచి బడ్జెట్
– మేయర్ గుండు సుధారాణి
నగరాభివృద్ధికి బల్దియా బడ్జెట్ దిక్సూచిగా నిలుస్తుంది. ప్రజలపై ఎలాంటి పన్నుల బారం పడకుండా బడ్జెట్ను ప్రవేశపెట్టాం. మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేటర్ల సహకారంతో నిరంతరం నగరాభివృద్ది కోసం శ్రమిస్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోనే ఉత్తమ నగరంగా నిలుపుతాం. వాస్తవాలకు దగ్గరగా బల్దియా బడ్జెట్ ను రూపొందించాం. గ్రేటర్లోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాం. గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలోని నాలుగు నియోజ కవర్గాల్లో మినీ స్టేడియంలు నిర్మించేలా ప్రణాళిక లు చేశాం. అంకెల గారడీ లేకుండా వాస్తవాలకు దగ్గరగా తయారు చేసిన బడ్జెట్తో నగరాన్ని అభివృద్ధి చేస్తాం.