నర్సంపేట రూరల్, ఆగస్టు 8 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని దేశభక్తిని చాటి చెప్పాలని జయముఖి కళాశాల యాజమాన్యం శంకర్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని ముగ్ధుంపురం గ్రామ శివారు జయముఖి అటానమస్ ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ‘హర్ ఘర్ తీరంగా’ కార్యక్రమాలన్ని ని ర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమా న్యం పోస్టాఫీస్ ద్వారా 200 జాతీయ జెండాలను కొనుగోలు చేసి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జానకి, ప్రొఫెసర్ ఎం లోక్నాద్రావు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రావు, అకాడమిక్ డీన్ అమిద్పాషా, ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ సతీశ్, అశ్విన్, కుమార్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
పోస్టాఫీస్లో జాతీయ జెండాల విక్రయం..
వర్ధన్నపేట: ప్రభుత్వ ఆదేశాల మేరకు పోస్టాఫీస్లో జాతీయ పతకాల విక్రయాన్ని పోస్టాఫీస్ అధికారులు సోమవారం ప్రారంభించారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించనున్న వజ్రోత్సవ సంబురాల్లో భాగంగా ప్రతి ఇంటిపై ప్రజలు జాతీయ పతకాలను ఎగరవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దీంతో గ్రామాల్లో సామాన్య ప్రజలు సైతం జాతీయ పతకాలను కొనుగోలు చేసుకుంటున్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించనున్న సంబురాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని సీఎం కేసీఆర్ పిలుపునివ్వడంతో మండలంలోని అన్ని గ్రామాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు సిద్ధమవుతున్నారు.
పోస్టాఫీసుల్లో జాతీయ జెండాల విక్రయం
రాయపర్తి: వజ్రోత్సవ వేడుకల్లో తంతి-తపాల శాఖ సైతం భాగస్వామిగా పాలుపంచుకుంటున్నట్లు మండల కేంద్రంలోని తంతి-తపాల కార్యాలయ పోస్ట్ మాస్టర్ మహ్మద్ మౌలానా తెలిపారు. సోమవారం పోస్టాఫీస్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆ జాది కా అమృత్ మహోత్సవ వేడకల్లో భాగంగా హర్ఘర్ తిరంగా నినాదంతో వజ్రోత్సవ వేడుకలను నిర్వహించాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో మండల కేంద్రంలోని పోస్టాఫీస్లో రూ.25కు జాతీయ పతకాలను విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో తపాల శాఖ సిబ్బంది చారి, మైస రాంచందర్, కిషన్, మహేందర్ పాల్గొన్నారు.
పాఠశాలలో వజ్రోత్సవాలు ప్రారంభం
నర్సంపేట: పాఠశాలలు, కళాశాలలో స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేడుకలను ప్రారంభమయ్యాయి. వ జ్రోత్సవాల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలలను ముస్తాబు చేశారు. నర్సంపేటలోని పలు పాఠశాలలు, కళాశాల్లో వేడుకలను ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయులు సతీశ్కుమార్, ఉపాధ్యాయులు రవీందర్, అంగన్వాడీ టీచర్ నల్లా భారతి పాల్గొన్నారు.
వజ్రోత్సవ పోటీలను జయప్రదం చేయాలి
రాయపర్తి: భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల్లో విద్యార్థులకు పలు విభాగాల్లో నిర్వహిస్తున్న పోటీ పరీక్షలను జయప్రదం చేయాలని గురుకుల ఇన్చార్జు ప్రిన్సిపాల్ ఉమామహేశ్వర్ కోరారు. సోమవారం గురుకులంలో వజ్రోత్సవ వేడుకల ఆరంభం సందర్భంగా గురుకులంలోని విద్యార్థునులు, బోధన, బోధనేతర సిబ్బందితో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను ఈనెల 8 నుంచి 22 వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వజ్రోత్సవ వేడుకలకు విద్యార్థునులు, తల్లిదండ్రులు, మండల ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికార యంత్రాంగం గమనించి సహకరించాల్సిందిగా ఆయన కోరారు.
ప్రతి ఒక్కరూ జాతీయజెండాను ఇంటిపై ఎగురవేయాలి
కరీమాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 75వ స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయజెండాను ఎగురవేయాలని న్యూ కౌటిల్యాస్(ఎస్ఏ) పాఠశాల కరస్పాండెంట్ శ్రీధర్ అన్నారు. సోమవారం కరీమాబాద్లోని పాఠశాల లో సిబ్బందికి జాతీయ జెండాలను అందజేశారు. ఈ సందర్భంగా కోడం శ్రీధర్ మాట్లాడుతూ దేశభక్తిని చాటేలా ప్రజలంతా ఐకమత్యంతో వేడుకలు నిర్వహించుకోవాలన్నారు. చిన్నతనం నుంచే పిల్లలలో దేశభక్తిని పెంచాలన్నారు. ప్రిన్సిపాల్ సబిత, సిబ్బంది పాల్గొన్నారు.
జాతీయ జెండాల పంపిణీ
గీసుగొండ: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా 15 రోజుల పాటు గ్రామాల్లో అనేక కార్యక్రమాలను చేపడుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఎంపీడీవో గడ్డం రమేశ్ సూచించారు. మండల పరషత్ కార్యాలయంలో సోమవారం జాతీయ జెండాను 21 గ్రామాలకు 8వేల జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను ఎగురావేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వమే జాతీయ జెండాలను పంపిణీ చేస్తుందన్నారు. పది రోజుల పాటు గ్రామాల్లో అనేక కార్యక్రమాలను చేపడుతూ దేశభక్తిని చాటాలని ఆయన సూచించారు. ఏపీఎం సురేశ్కుమార్, ఎంపీవో ప్రభాకర్, ఏపీవో మోహన్రావు, కార్యదర్శులు పాల్గొన్నారు.
తపాలశాఖ ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ
వరగంల్ చౌరస్తా, ఆగస్టు 8 : తపాల శాఖ వరంగల్ డివిజన్ కార్యాలయం పరిధిలో ‘హర్ ఘర్ తిరంగా’ బైక్ ర్యాలీని నిర్వహించారు. సోమవారం ఉదయం డివిజన్ ప్రధాన కార్యాలయం నుంచి సూపరింటెండెంట్ రఘునందస్వామి ర్యాలీని ప్రారంభించి, వరంగల్ చౌరస్తా మీదుగా పోచమ్మమైదాన్ జంక్షన్కు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. దేశంలోని ప్రతి కుటుంబం దేశంపై తమ బాధ్యతను, దేశ ఐక్యతను చాటుతూ ప్రతి ఇంటికి జెండాను ఎగరేయాలనే కార్యక్రమాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే ఇంటింటికీ జెండాను అందుబాటులో ఉంచడానికి పోస్టల్ డివిజన్ పరిధిలోని 2 హెడ్ పోస్టాఫీసులు, 42 సబ్ పోస్టాఫీసులు, 342 బ్రాంచ్ పోస్టాఫీసుల్లో 30 ఇంచుల వెడల్పు, 20 ఇంచుల ఎత్తు కలిగిన జాతీయ జెండాను రూ. 25 చొప్పున అ మ్మకానికి అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ డిప్యూటీ సూపరింటెండెంట్ పసునూరి ప్రభాకర్, ఉద్యోగులు, సిబ్బంది, పోస్టుమ్యాన్లు పాల్గొన్నారు.