స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జిల్లాలో ఇంటింటికీ త్రివర్ణ పతాకాలను పంపిణీ చేయనున్నది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావన, పోరాట స్ఫూర్తిని నింపేందుకు ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నది. నేటి నుంచి ఆగస్టు 22 వరకు పలు కార్యక్రమాల కోసం రూపకల్పన చేసింది. ఇందులో ప్రజలందరినీ భాగస్వాములను చేస్తున్నది. పిల్లలు, యువత, మహిళలు, కవులు, కళాకారులు, క్రీడాకారులు, వృత్తి నిపుణులు.. ఇలా అన్ని వర్గాల వారు పాలుపంచుకునేలా ఏర్పాట్లు చేసింది.
– వరంగల్, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి): బ్రిటిష్ పాలన నుంచి మన దేశం విముక్తి పొంది 75 ఏండ్లు అయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నది. హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ సోమవారం ఈ కార్యక్రమాలను ప్రా రంభించారు. ఇంటింటికీ జాతీయ పతాకం పంపిణీతో జిల్లాల్లో మంగళవారం నుంచి మొదలవుతున్నాయి. ప్రతి పల్లె, బస్తీల్లోనూ ప్రతి ఇంటికీ జాతీయ పతాకం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరే షన్ల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికీ జాతీయ జెండాను అం దించనున్నారు. అన్ని శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమా లు నిర్వహిస్తున్నారు.
ఈ ఉత్సవాల నేపథ్యంలో ప్రభు త్వ శాఖల ఉద్యోగులు అందుబాటులో ఉండేలా జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. పరాయి పాలన నుంచి విముక్తి పొందిన గొప్ప పోరాటాన్ని, స్వతంత్ర దినోత్సవ అనుభూతులను గుర్తు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను రూపొందించింది. ఈ నెల 22 వరకు వీటిని నిర్వహించేందుకు వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఆగ స్టు 8 నుంచి 22 వరకు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా మంత్రులు, స్థానిక సంస్థల ప్రజాప్రతి నిధులు, జిల్లా కలెక్టర్లు, ముఖ్య అధికారులు నేతృత్వం లోని కమిటీలు చర్యలు తీసుకున్నాయి.
కార్యక్రమాల్లో మొదటి రోజు నిర్వహించే జాతీయ పతాకం పంపిణీ కోసం గ్రేటర్ వరంగల్, అన్ని గ్రామాల్లో ఏర్పాట్లు చేశా రు. ప్రతి ఇంటికీ పంపిణీ చేసేందుకు అవసరమైన జాతీయ పతాకాలను సిద్ధంగా పెట్టారు. ఈ కార్యక్రమా ల్లో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసేలా రాష్ట్ర ప్రభు త్వం కార్యక్రమాలను రూపొందించింది. పిల్లలు, యు వత, మహిళలు, కవులు, కళకారులు, క్రీడాకారులు, వృత్తి నిపుణులు… ఇలా అన్ని వర్గాల వారు వజ్రోత్స వాల్లో భాగస్వాములు అవుతున్నారు. ఇందులో భాగం గానే పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలు ఉన్నా యి. అటవీ సంపదను పెంచి ప్రకృతిని పరిరక్షించడం లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రారంభించిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం వజ్రోత్సవాలలో మరింత ముందుకు సాగనున్నది.
బుధవారం అన్ని గ్రామాలు, బస్తీలలో మన మహోత్సవం పేరుతో మొక్కలు నాట నున్నారు. తోబుట్టువుల అప్యాయతను చాటే రాఖీ పండుగ సందర్భంగా వజ్రోత్సవాలలో ప్రత్యేకంగా జాతీయ సమైక్యత రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వ హించాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఉత్సవా ల్లో మహిళలను ఎక్కువగా భాగస్వాములను చేసేలా దేశ భక్తి అంశంతో ప్రత్యేకంగా ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నారు. ఫ్రీడం రన్, ఫ్రీడం కప్ పేరుతో ఉద్యోగులు, యువతకు ఆటల పోటీలను నిర్వహించే లా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రాణాలను నిలిపే రక్త సేకరణ కోసం శిబిరాలను నిర్వహిస్తున్నారు. అందరి లో దేశ భక్తి భావన స్ఫూర్తిని పెంచడంలో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాలను ప్రతి ఊరిలో, బస్తీలలో నిర్వహించేలా ఏర్పాట్లు జరు గుతున్నాయి. ఉత్సవాల నిర్వహణ కోసం జిల్లా స్థాయి కమిటీలు ఇప్పటికే పలుసార్లు సమావేశమయ్యాయి. రోజువారీగా నిర్వహించే కార్యక్రమాలకు బాధ్యులను నియమించి పర్యవేక్షిస్తున్నారు.
ఆగస్టు9: ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ
10: వన మహోత్సవం
11: ఫ్రీడం రన్
12: జాతీయ సమైక్యత రక్షాబంధన్
13: జాతీయ జెండా, ప్లకార్డులతో ర్యాలీలు.. మైదానాల్లో సమావేశాలు
14: సాంసృతిక సారథి కళాకారులతో జిల్లా, నియోజకవర్గాల కేంద్రాల్లో ప్రదర్శనలు
15: స్వాతంత్య్ర వేడుకలు
16: సామూహిక జాతీయ గీతాలాపన, కవి సమ్మేళనాలు
17: అన్ని జిల్లా కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు
18: ఫ్రీడం కప్-ఉద్యోగులు, యువతకు ఆటల పోటీలు
19: ఆస్పత్రులు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, జైళ్లలో ఖైదీలకు పండ్లు, స్వీట్ల పంపిణీ
20: దేశభక్తి అంశంగా మహిళలకు ముగ్గుల పోటీలు
21: స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశం
22: వజ్రోత్సవ ముగింపు వేడుకలు