గీసుగొండ, ఆగస్టు 6 : తెలంగాణ సిద్ధాంత కర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ గొర్రెకుంట క్రాస్ రోడ్లో జయశంకర్ 88వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చల్లా సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను చైతన్యం చేసి స్వరాష్ట్ర సాధన ఉద్యమం వైపు నడిపించిన మహనీయుడు జయశంకర్ సార్ అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సుంకరి మనీషా-శివకుమార్, ఆకుపల్లి మనోహర్, గద్దె బాబు, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, మండలాధ్యక్షుడు వీరగోని రాజ్కుమార్, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోలి రాజయ్య, నాయకులు బాబు, లవ్ రాజు, రమేశ్, నర్సయ్య, వేణు పాల్గొన్నారు.