పోచమ్మమైదాన్, జూన్ 18 : జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలను కల్పించేందుకు ఈ నెల 22న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎన్ మాధవి ఒక ప్రకటనలో తెలిపారు.
ములుగు రోడ్డులోని ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రాంగణంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం ఉందని, ఎంపికైన వారికి నెలకు రూ.10వేల వేతనం చెల్లిస్తారని వివరించారు. వివరాలకు 7799314685లో సంప్రందించాలని కోరారు.