ఖిలావరంగల్, ఏప్రిల్ 4 : రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించేకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వరంగల్ కలెక్టర్ బీ అన్నారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్ స మావేశ మందిరంలో ముస్లిం మత పెద్దలతో సమా వేశా న్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రభుత్వం పేద ముస్లింకు అందించేందుకు 6 వేల రంజాన్ కిట్లను ఈనెల 8లోపు పంపిణీ చేస్తామన్నారు. నిరుపేదలకు రంజాన్ గిఫ్ట్లు అందే విధంగా ముస్లిం మత పెద్దలు సహకరించాలన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లాలో ఉన్న ప్రతీ మసీద్లో ముస్లిం సోదరులు ప్రార్థన లు చేసుకునేలా అన్ని మౌలిక వసతులు ఉండాలని, శానిటేషన్ నిర్వహణ, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ఎంపీవో, ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ సమస్య వచ్చినా ముస్లిం సోదరులు తమ దృష్టికి తీసుకురావచ్చన్నారు. కరోనా వైరస్ కారణంగా గతంలో ఘనంగా రంజాన్ పండుగను జరుపుకోలేక పోయామని, ఈ ఏడాది పెద్ద ఎత్తును నిర్వహించుకునేలా ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బీ హరిసింగ్, జీడబ్ల్యూ ఎంసీ అడిషనల్ కమిషనర్ అనీష్ ఉర్ రషీద్, ఆర్డీవోలు మహేందర్జీ, పవన్, ఇన్చార్జి మైనార్టీ అధికారి శంకర్ నాయక్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణకు సిద్ధం..
రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పంచాయతీ వార్డులు, పం చాయతీలు, మున్సిపాలిటీల్లో వార్డులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానిల ఎన్నికలపై నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల క మిషన్ పార్థసారథి, నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ బీ గోపి మాట్లాడారు. వరంగలల్ జిల్లాలో 41 వార్డు సభ్యులు, ఐదు సర్పంచ్, రెండు ఎంపీటీసీ స్థానా లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆయా స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు సిద్ధం చేశామన్నారు. ఈ వీడియో కాన్ఫ రెన్స్లో జడ్పీ సీఈవో రాజారావు, డీపీవో స్వరూప డీటీ సుభాన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వరంగల్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ సెల్లో 65 మంది తమ సమస్యలను కలెక్టర్ బీ గోపికి వివరిస్తూ వినతి పత్రాలు అందజేశారు.