కాశీబుగ్గ, ఏప్రిల్ 4 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం దేశీరకం మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది. దేశ చరిత్రలోనే అత్యధిక రేటు నమోదైంది. నల్లబెల్లి మండలంలోని గొవిందాపురం గ్రామానికి చెందిన రైతు పేరాల కిషన్రావు 30 బస్తాల దేశీరకం మిర్చి తీసుకురాగా కాకతీయ ట్రేడర్స్ అడ్తి ద్వారా శాంభవి ట్రేడింగ్ చిల్లీస్ ఖరీదు వ్యాపారి క్వింటాల్కు రూ.55వేల551 ధరతో కొనుగోలు చేశాడు. కాగా, ఈ సీజన్లో4.22లక్షల క్వింటాళ్ల మిర్చి వచ్చినట్లు మార్కెట్వర్గాలు తెలిపారు. అందులో దేశీరకం మిర్చి సుమారు 7500 క్వింటాళ్లు వచ్చినట్లు తెలిపారు.
మెరిసిన తెల్లబంగారం..
గీసుగొండ మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన రైతు కుక్కమూడి కట్టయ్య మార్కెట్కు 6 బస్తాల పత్తి తీసుకువచ్చాడు. నాగార్జున ట్రేడర్స్ అడ్తి ద్వారా గణపతి సాయి ట్రేడర్స్ కాటన్ ఖరీదు వ్యాపారి క్వింటాల్కు రూ.12,110 ధతో కొనుగోలు చేశాడు. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 5. 70లక్షల క్వింటాళ్ల పత్తి వచ్చినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. కాగా, రైతు పేరాల కిషన్రావును మార్కెట్ ప్రధాన కార్యాలయంలో చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి, జేడీఎం ఎన్నారపు మల్లేశం, కార్యదర్శి బరుపాటి వెంకటేశ్ రాహుల్ సన్మానించారు. కార్యక్రమంలో గ్రేడ్-2 కార్యదర్శులు తోట చందర్రావు, ఎండీ బియాబాని, అసిస్టెంట్ సెక్రటరీలు జన్ను భాస్కర్, ఎండీ లాషరీఫ్, సూపర్వైజర్లు ముడిదె శివకుమార్, భూక్యా వెంకన్ననాయక్, గంగాధర్ పాల్గొన్నారు.