కమలాపూర్, నవంబర్ 27: గంజాయి సేవిస్తుండ గా ఆరుగురు బీటెక్ విద్యార్థులు, కారు డ్రైవర్ను పోలీ సులు పట్టుకొని అరెస్ట్ చేశారు. ఆదివారం కమలాపూర్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో సీఐ సంజీవ్ వివరాలు వెల్లడించారు. మండలంలోని మాదన్నపే ట-గూనిపర్తి గ్రామాల మధ్య తాటి వనంలో గంజా యి సేవిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసు లు అక్కడికి వెళ్లారు. హనుమకొండలో బీటెక్ చదువు తున్న పిట్ట కళ్యాణ్, మంద అరవింద్, రూపురెడ్డి వంశీ, గోపు వినయ్రెడ్డి, పాలకుర్తి విజయ్, వెంగళ విజయ్, కారు డ్రైవర్ ఎస్కే ఖాజా గంజాయి సేవి స్తుండగా పట్టుకున్నారు. వారి నుంచి ఐదు సెల్ఫోన్లు, రెండు హుక్కా ప్యాట్స్, సిగరెట్ ప్యాకెట్లు, కూల్డ్రింక్ ఖాళీ సీసాలు, రూ. ఐదు వేల విలువవైన 510 గ్రా ముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు సీఐ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదా ర్థాలకు బానిసై బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని అన్నారు. తాత్కాలిక ఆకర్షణకు గురై వి లువైన జీవితాన్ని దెబ్బతీసుకోవద్దని సూచించారు. గం జాయి సేవించిన వారిలో ఆరుగురు విద్యార్థులు ఉండ డం బాధాకరమన్నారు. కళాశాలకు వెళ్తున్న తమ పిల్ల లపై ఎటు వెళ్తున్నాడో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లి దండ్రులపై ఉందన్నారు. సమావేశంలో ఎస్సైలు చర ణ్, సతీశ్, ఏఎస్సై సమ్మిరెడ్డి, కానిస్టేబుళ్లు ఉన్నారు.