దసరా నవరాత్రుల ఆగమనంతోనే కొనుగోలుదారులకు షాపింగ్ సంబురాలను మోసుకొచ్చిన ’నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే’ బొనాంజా శనివారం నాడు అట్టహాసంగా ముగిసింది. బేగంపేటలోని టూరిజం హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాస్ రెడ్డి, అడ్వైర్టెజ్మెంట్ జీఎం సురేందర్ రావు, ఆపరేషన్స్ జీఎం సీహెచ్ శ్రీనివాస్, సర్క్యులేషన్ డీజీఎం రామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలను చైతన్యపరచడంలో నమస్తే తెలంగాణ పత్రిక ముందు వరుసలో ఉందని ఈ సందర్భంగా మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి ప్రశంసించారు. విజేతను ఎంపిక చేసిన తర్వాత… బొనాంజా కార్యక్రమానికి స్పాన్సర్లుగా వ్యవహరించిన ఆయా వాణిజ్య సంస్థల యజమానులకు, ప్రతినిధులకు గౌరవ పురస్కారాలు అందజేశారు.
– సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ)