నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 24;తరతమ భేదం లేకుండా మన కార్మికులకే కాదు.. ఇతర రాష్ర్టాల కార్మికులకు ఉపాధి కల్పిస్తూ వారిని అక్కున చేర్చుకొని కార్మికపక్షపాతి అయ్యారు. ఓ వైపు కేంద్రంలోని బీజేపీ సర్కారు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వారి హక్కులను కాలరాస్తూ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్న తరుణంలో కేసీఆర్ లాంటి వ్యక్తి దేశ రాజకీయాల్లో ఉంటేనే కార్మికవర్గానికి న్యాయం జరుగుతుంది. కనీస వేతనాలు రావాలన్నా. హక్కులు అమలుకావాలన్నా అది ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్య’మని కార్మిక సంఘాల నాయకులు ముక్తకంఠంతో చెబుతున్నారు. తెలంగాణ తరహాలో దేశంలోని అన్ని రంగాల్లోని కార్మికులకు కొండంత ధీమా వస్తుందని చెబుతున్నారు. కేసీఆర్కు అపార అనుభవం, ఆలోచనతో కార్మికులకు అనేక ప్రయోజనాలు చేకూర్చి.. మంచిరోజులు తెస్తారని అభిప్రాయపడ్డారు.
కేసీఆర్తోనే కార్మికుల సమస్యలు పరిష్కారం
మహబూబాబాద్ రూరల్, సెప్టెంబర్ 24 : కేసీఆర్తోనే కార్మికుల సమస్యలు పరిష్కారం కానున్నాయి. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. దేశంలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలన్నింటీని ప్రైవేట్పరం చేస్తున్నది. దీంతో కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగి ఉపాధి లేకుండా పోతున్నది. నేడు దేశంలో మోదీ అనుసరిస్తున్న విధానాలు పెట్టుబడిదారులకే అనుగుణంగా ఉన్నాయి. మోదీ ప్రధాని అయిన దగ్గర నుంచి కార్మికుల హక్కులను కాలరాస్తూ కనీస వేతనాలు అమలుచేయడం లేదు. దేశంలో పేద వర్గాలకు న్యాయం జరుగకుండా పోతున్నది. కేసీఆర్ వంటి ఆలోచనాపరుడు దేశ రాజకీయాల్లోకి వెళ్తే కార్మికులకు సముచిత స్థానం దక్కుతుంది.
– కొత్తపల్లి రవి, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు
అందరి కోసం ఆలోచించే నేత
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 24 : దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఉచిత కరెంటు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం చాలా మంచి నిర్ణయం. అలాగే రైతు బీమా కూడా దేశంలో ఉన్న రైతులందరికీ వర్తింపజేయాలని కోరుకుంటున్నాం. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కేసీఆర్ని మించిన వారు మరొకరు లేరు. నిత్యం పేద ప్రజల కోసం ఆలోచించే గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్. ఒక తెలుగువాడిగా కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని మనస్ఫూర్తిగా ఆ భద్రకాళి అమ్మవారిని కూడా వేడుకుంటున్నా. తెలంగాణ మాదిరిగా దేశంలో కూడా గొప్ప మార్పు రావాలంటే ఆయన జాతీయ రాజకీయాల్లో ఉండాలి. కేసీఆర్ వల్ల దేశంలో అన్ని వర్గాలకు ప్రయోజనం కలుగుతుంది.
– వెంకటాచారి, జిల్లా టూ వీలర్స్ సంఘం హనుమకొండ అధ్యక్షుడు
కార్మికులకు మంచిరోజులు వస్తాయి..
రఘునాథపల్లి, సెప్టెంబర్ 24 : ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే కార్మికులకు మంచి రోజులు వస్తాయి. రాష్ట్రంలో కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఆయన దేశానికి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉన్నది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నది. దేశంలో వేలాది చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. ఉపాధి లేక లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. బడా పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా ప్రధాని మోదీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఆలోచన విధానాలు ఎంతో అవసరం. దేశంలో విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ప్రతిఘటిస్తున్నారు. అలాంటి నేతతోనే భారతదేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుంది.
– రాసమల్ల కొమురయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు, జనగామ
కేసీఆర్ ఆలోచనలు దేశానికి అవసరం
జఫర్గఢ్, సెప్టెంబర్ 24 : దేశంలో కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఆలోచన విధానాలు అవసరం. దేశంలో విస్తృతమైన సహజ, మానవ వనరులున్నా నరేంద్రమోదీ ప్రభుత్వం ఉపయోగించుకోవడంలేదు. ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో దేశం 20 యేండ్లు వెనక్కి పోయింది. కార్మికుల హక్కులు కాలరాస్తున్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ ఉండాలి. కేంద్ర మంత్రిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఆయనకు అపార అనుభవం ఉంది. దేశ ప్రజలకు కేసీఆర్ నాయకత్వం అవసరం.
– రాపర్తి సోమయ్య, సీఐటీయూ జిల్లా నాయకుడు, జనగామ
దేశ ఆర్థిక వ్యవస్థను బాగుచేస్తడు..
కృష్ణకాలనీ, సెప్టెంబర్ 24 : పాలనలో అపార అనుభవం ఉన్న సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే ఆర్థిక వ్యవస్థను బాగుచేస్తడు. ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా సీఎం కేసీఆర్ కార్మికులకు ప్రతి ఏటా దసరా, దీపావళి బోనస్ ఇస్తున్నాడు. విద్యుత్ కార్మికులకు 35శాత ఫిట్మెంట్ ఇచ్చి ఆదుకుంటున్నడు. రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్మిక సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయగల సత్తా ఉన్న నాయకుడు కేసీఆరే. ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నా. కేసీఆర్ పాలనలో అన్ని రంగాల కార్మికులు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందారు. బీజేపీ పాలనలో కార్మికులు అనేక హక్కులు కోల్పోయారు.
– బుర్ర కుమారస్వామి గౌడ్, టీఎస్ జెన్కో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం హెచ్-58 రాష్ట్ర ఉపాధ్యక్షుడు
ప్రపంచానికి రోల్మోడల్ అయితది
ములుగు,సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినంక కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శమైనయ్. కరంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలె అన్నోళ్లకు పాలన అంటే ఏందో ఈ ఎనిమిదేళ్లలో చూపిచ్చిండు. జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ వస్తాననడం దేశ ప్రజల అదృష్టం. ఆయనను ఆశీర్వదిస్తే ఇక్కడి పథకాలు దేశమంతా అమలై ప్రపంచానికి రోల్మోడల్ అయితయ్. కోతలు లేని కరంట్తో మాలాంటి వ్యాపారులకు చేతినిండా పని ఉంటాంది. దుకాణాలు మంచిగ నడిపించుకుంటానం. కేసీఆర్ దేశానికి నాయకత్వం వహిస్తే తెలంగాణ లెక్క దేశంలోని అన్ని రాష్ర్టాలు బాగుపడుతయ్.
– ఎం.ఏ.ఆరిఫ్, టైర్ వర్క్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, ములుగు