డోర్నకల్, మే 25 : ఎన్నికలు సమీపిస్తున్నందున గ్రామాల్లోకి కాంగ్రెస్, బీజేపీ నాయకులు కొత్త బిచ్చగాళ్ల లాగా వస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం డోర్నకల్లో ఓ శుభకార్యానికి హాజరైన మంత్రి విలేకరులతో మాట్లాడారు. ప్రజాసేవకుడు సీఎం కేసీఆర్ అన్నారు. కాం గ్రెస్, బీజేపీ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో సంక్షేమ పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి మాయ మాటలను ప్రజలు నమ్మరన్నా రు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రతి గడపకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేరయన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. అనంతరం డోర్నకల్ మార్కెట్ పనులను త్వరగా ప్రారంభించాలని కలెక్టర్ శశాంకను ఫోన్లో కోరారు. మార్కెట్ లేకపోవడంతో కూరగాయలు, పండ్ల వ్యాపారుల మధ్య గొడవలు జరుగుతున్నాయన్నారు.
మార్కె ట్ నిర్మాణ బాధ్యతలు అదనపు కలెక్టర్ అప్పగించి త్వరగా పూర్తి చేసేలా చ ర్యలు తీసుకోవాలని కలెక్టర్ను మంత్రి ఆదేశించారు. ఆమె వెంట మాదా శ్రీనివాస్, మాన్యూపాట్ని రామకృష్ణ, తాళ్లూరి హనుమ, మైను పాషా, తాళ్లూ రి గంగాధర్, తాళ్లూరి రామయ్య, భాస్కర్, భద్రూనాయక్ ఉన్నారు.