ఖిలావరంగల్, ఆగస్టు 9: మొహర్రం అంటేనే త్యాగాల చరిత్ర. మొహర్రం అనగానే అందరికి గుర్తుకొచ్చేది హసన్, హుస్సేన్. రాచరిక వ్యవస్థ నిర్మూలనకు.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేసిన కృషి అంతా ఇంతా కాదు. ముస్లిములకే కాదు.. ముస్లిమేతరులకు కూడా ఆ మహనీయుల త్యాగాలు మనసును తట్టిలేపుతాయి.
హిందూ ముస్లింల ఐక్యతకు.. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం పర్వదిన వేడుకలను జిల్లావ్యాప్తంగా అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలో జిల్లా నలుమూలల నుంచి అశేష భక్తజన వాహిని తరలివచ్చింది. హిందూ ముస్లిం వయో, లింగ బేదం లేకుండా సమష్టిగా పీరీల ఊరేగింపులో పాల్గొన్నారు. మధ్యకోట సదర్చౌక్ బక్షిమహాల్లోని పీరీల కొట్టాల్లో 9 రోజుల పాటు పీరీలకు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.
మంగళవారం కోటలోని పీరీలను మేయర్ గుండు సుధారాణి దర్శించుకొని ప్రార్థనలు చేశారు. డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, 37, 38 డివిజన్ల కార్పొరేటర్లు బోగి సువర్ణ, బైరబోయిన ఉమ, శంభునిగుడి చైర్మన్ గజ్జెల శ్యామ్, మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్యాదవ్, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు బోగి సురేష్, నాయకులు ఖదీర్, ఖరీం, రబ్బాని, ఇబ్బహీం, అబ్రార్, మోయిస్, టీఆర్ఎస్ నాయకులు ఎస్ విజయ్, ఎన్ నవీన్, ఎండీ ఉల్ఫత్, బొల్లం కార్తీక్ పాల్గొన్నారు.
రాయపర్తి/దుగ్గొండి/కరీమాబాద్/కాశీబుగ్గ: రాయపర్తి మండలంలో మొహర్రం వేడుకలను కనుల పండువగా నిర్వహించారు. అస్సై దులా హారతీ.. కాళ్ల గజ్జెల గమ్మతీ నినాదాలతో ర్యాలీగా ఆశూర్ఖానాల వద్దకు పీరీలను తీసుకొచ్చి అగ్ని గుండాల వద్ద ప్రదక్షిణలు చేసి సవార్లకు ఊదు పొగలు వేసి పాతీహాలు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ముజావర్లు అబ్దుల్ రెహమాన్, ఖాసీం, అస్గర్ అలీ, ఉస్మాన్, సలీం, లాలూమహ్మద్, ఉస్మాన్, సమీర్, వాజీద్, తాజుద్దీన్, మైపాషా, ఆశ్రఫ్పాషా పాల్గొన్నారు.
దుగ్గొండిలోని మసీదులో ముస్లిం మతపెద్దల ఆధ్వర్యంలో మొహర్రం వేడుకలు నిర్వహించారు. కరీమాబాద్లో ముస్లిం కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు సాధిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొహర్రం వేడుకల్లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పండుగలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. యాకూబ్పాషా, రబ్బానీ, ఖాజాపాషా, వహీద్, మోయిన్, రాజారెడ్డి, బాల కొమురెల్లి పాల్గొన్నారు.
కాశీబుగ్గ/సంగెం/గిర్మాజీపేట/నల్లబెల్లి/నర్సంపేటరూరల్: మనదేశం సర్వమతాల సమ్మేళనమని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. వరంగల్ 3వ డివిజన్లోని పైడిపల్లిలో ఆయన మొహర్రం వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలితాయాదవ్, కార్పొరేటర్ జన్ను షిభారాణి-అనిల్, పీఏసీఎస్ చైర్మన్ హరికృష్ణ, డివిజన్ అధ్యక్షుడు రాజు, మాజీ కార్పొరేటర్ వీర భిక్షపతి పాల్గొన్నారు.
సంగెం మండలంలోని సంగెం, గవిచర్ల, పల్లార్గూడ, తీగరాజుపల్లి లో మొహర్రం వేడుకలు నిర్వహించారు. వరంగల్ నిజాంపురలో మొహర్రం వేడుకులు జరిగాయి. టీఆర్ఎస్ నాయకుడు ఎస్డీ మసూద్ పాల్గొన్నారు. నల్లబెల్లిలో ముస్లిం మతపెద్ద నాసర్ ఆధ్వర్యంలో పీరీలను ఊరేగించారు. శంషాబాద్, నల్లబెల్లి, నారక్కపేటలో మొహర్రం వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
పీరీలకు నీళ్లారబోసి కుడుకలు, దట్టీలు, పూల దండలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నర్సంపేట మండలంలోని గ్రామాల్లో పీరీలను ఊరేగించారు. భక్తులు కానుకలు సమర్పించారు. అగ్నిగుండ ప్రదర్శనలు చేపట్టారు. హిందూ ముస్లిం అనే తేడా లేకుండా మొహర్రం వేడుకలను ప్రజలు జరుపుకున్నారు. భాంజీపేటలో సంతానం లేని వారు వరాలు పట్టారు. కార్యక్రమంలో ముజావర్ జబ్బార్, ఎస్కే రహీం, రమేశ్, ప్రవీణ్, భాస్కర్, పాపయ్య, ఆనంద్, సారయ్య, రాజు పాల్గొన్నారు.