భూపాలపల్లి రూరల్,1: జీఎంఆర్ఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో టెట్ ఉచిత కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు శుక్రవారం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జిల్లాలోని నిరుపేదలకు కోచింగ్ ఇచ్చేందుకు ఎమ్మెల్యే గండ్ర, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, జీఎంఆర్ఎం ట్రస్ట్ సెక్రటరీ గండ్ర గౌతమ్రెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే తండ్రి పేర గండ్ర మోహన్రెడ్డి మెమోరియల్ (జీఎంఆర్ఎం) ట్రస్ట్ స్థాపించా రు.
దాదాపు 200 మందికి 55 రోజులపాటు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తూ జయశంకర్ అకాడమీ వారితో కోచింగ్ ఇప్పించారు. వారిలో 80శాతం మంది శుక్రవారం వెలువడిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు. ముమ్మటి కావ్య మధుర కవి సిరివెన్నెల 105 మార్కులు సాధించారు. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ట్రస్ట్ చైర్మన్, ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేక్ను కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఎక్కువ మార్కులు సాధించిన వారిని సన్మానించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు బుర్ర రమేశ్, దేవర ముత్తు, గమల్ల ప్రేమ్ కుమార్, నల్ల రాము, గడ్డం రవి, జయంత్, బుర్ర రాజు, శ్రీకాంత్ పటేల్, రాకేశ్ పాల్గొన్నారు.